news

News April 5, 2025

శుభ ముహూర్తం (05-04-2025)

image

☛ తిథి: శుక్ల అష్టమి రా.12.31 వరకు
☛ నక్షత్రం: ఆరుద్ర ఉ.10.13 వరకు
☛ శుభ సమయం: ఆరుద్ర శివ పూజలకు మంచిది
☛ రాహుకాలం: ఉ.9.00-మ.10.30 వరకు
☛ యమగండం: మ.1.30-మ.3.00 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ.7.36 వరకు
☛ వర్జ్యం: రా.10.11-11.44 గంటల వరకు
☛ అమృత ఘడియలు: అమృతం లేదు

News April 5, 2025

సీఎం రేవంత్‌ రెడ్డికి జాన్ అబ్రహం రిక్వెస్ట్

image

కంచ గచ్చిబౌలి వివాదంపై బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం స్పందించారు. ఆ డెవలప్‌మెంట్ ప్లాన్‌ను నిలిపివేయాలని CM రేవంత్‌ని కోరారు. HYDకు ఆక్సిజన్ అందిస్తున్న 400 ఎకరాల అడవిలో ఎన్నో వణ్యప్రాణులు ఉన్నాయని, వేలాది చెట్లను కొట్టి వాటికి గూడు లేకుండా చేయొద్దని ట్వీట్ చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం దీన్ని వ్యతిరేకించారు. అటు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు చెట్లు కొట్టొద్దని ప్రభుత్వాన్ని SC ఆదేశించింది.

News April 5, 2025

TODAY HEADLINES

image

AP: బర్డ్‌ ఫ్లూపై ఆందోళన వద్దు: CM చంద్రబాబు
TG: జీవన ప్రమాణాలు పెరిగే విధంగా విద్యావ్యవస్థ ఉండాలి: CM రేవంత్
వక్ఫ్ బిల్లుతో అన్యాయం, అవినీతి అంతం: అమిత్ షా
వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: కాంగ్రెస్
AP: తల్లిపై కేసు వేసిన కొడుకుగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు: షర్మిల
AP: నా పోటీ సీఎం చంద్రబాబుతోనే: లోకేశ్
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. రూ.11Cr సంపద ఆవిరి

News April 5, 2025

BREAKING: APPSC గ్రూప్ 2 ఫలితాలు విడుదల

image

AP: ఈ ఏడాది ఫిబ్రవరి 23న నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. రిజల్ట్స్‌తోపాటు ఎగ్జామ్ ఫైనల్ కీ కూడా రిలీజ్ చేసింది. కీని APPSC వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. సర్టిఫికెట్ల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను సెలెక్ట్ చేసింది. స్పోర్ట్స్ కోటాతో సహా మొత్తం 2,517 మందిని ఎంపిక చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం వీరందరికి త్వరలోనే కాల్ లెటర్లు పంపనుంది.

News April 5, 2025

IPL: ఉత్కంఠపోరులో గెలుపెవరిదంటే..

image

ముంబైతో జరిగిన ఉత్కంఠ పోరులో LSG విజయం సాధించింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాటర్లలో నమన్ ధీర్(24 బంతుల్లో 46), సూర్యకుమార్(43 బంతుల్లో 67) పోరాడినా ఫలితం లేకపోయింది. LSG బౌలర్లలో శార్దూల్, ఆకాశ్, ఆవేశ్, దిగ్వేశ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

News April 4, 2025

ఈ నెల 16 నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె

image

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అఖిలపక్ష కార్మిక సంఘాలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు నిరసనగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నెల 7, 8 తేదీల్లో యాజమాన్యంతో చర్చిస్తామని, సానుకూలంగా స్పందించకపోతే 16 నుంచి విధులు బహిష్కరిస్తామని ప్రకటించాయి. రేపు సాయంత్రం ఫ్యాక్టరీ ఆర్చ్ వద్ద రాస్తారోకో చేస్తామని తెలిపాయి. త్వరలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు ఇస్తామని పేర్కొన్నాయి.

News April 4, 2025

శ్రీలంకలో అడుగుపెట్టిన మోదీ

image

ప్రధాని మోదీ థాయ్‌లాండ్ పర్యటన ముగించుకుని శ్రీలంకకు చేరుకున్నారు. ఆయనకు కొలంబో ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఈ ద్వీప దేశ అధ్యక్షుడిగా అనుర కుమార దిస్సనాయకే బాధ్యతలు స్వీకరించాక మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. 3 రోజుల విజిట్‌లో రక్షణ, ఇంధన, హెల్త్, వాణిజ్య రంగాలపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.

News April 4, 2025

చరిత్ర సృష్టించాడు!

image

LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య ఐదు వికెట్లతో సత్తా చాటారు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో ఫైఫర్ తీసిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించారు. 4 ఓవర్లలో 36 పరుగులకు పూరన్, పంత్, మార్క్‌రమ్, మిల్లర్, ఆకాశ్ దీప్ వికెట్లను తీశారు. ఆయన టీ20 కెరీర్లో ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం.

News April 4, 2025

‘వక్ఫ్’ తరహాలోనే పార్లమెంటులో సుదీర్ఘ చర్చలివే!

image

వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్‌సభలో 14 గంటలు, రాజ్యసభలో 17 గంటల పాటు చర్చ జరిగింది. ఇదొక అరుదైన విషయమని RS ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ తెలిపారు. అయితే గతంలోనూ పార్లమెంటులో మారథాన్ చర్చలు జరిగాయి. LSలో స్టేట్ ఆఫ్ అవర్ డెమొక్రసీపై 20.8గంటలు, రైల్వే బడ్జెట్‌పై 1993లో 18.35గంటలు, 1988లో 19.04గంటలు, మైనార్టీల భద్రత బిల్లుపై 17.25గంటలు, 1981లో RSలో ఎసెన్షియల్ సర్వీసెస్ బిల్లుపై 16.88గంటల చర్చ జరిగింది.

News April 4, 2025

కొత్త ఎడ్యుకేషనల్ పాలసీ రూపొందించండి: సీఎం రేవంత్

image

TG: విషయ పరిజ్ఞానంతో పాటు జీవన ప్రమాణాలు పెరిగే విధంగా విద్యా వ్యవస్థ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దానికి అనుగుణంగా కొత్త ఎడ్యుకేషనల్ పాలసీని రూపొందించాలని విద్యాశాఖను ఆదేశించారు. విద్యాశాఖ ఛైర్మన్ ఇతర అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పలు రాష్ట్రాల్లో అమలవుతున్నవిద్యా విధానాలను ఛైర్మన్ ఆకునూరి మురళి, మాజీ IAS జయప్రకాశ్ నారాయణ, సీఎంకు వివరించారు.