India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

RBI నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.10, రూ.500 నోట్లను జారీ కానున్నాయి. మహాత్మా గాంధీ సిరీస్లో ప్రస్తుతం ఉన్న నోట్ల మాదిరిగానే ఇవి కూడా ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. గతంలో జారీ చేసిన నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. మల్హోత్రా సంతకంతో కొత్త రూ.100, రూ.200 నోట్లను రిలీజ్ చేస్తున్నట్లు గత నెల ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.

లక్నోలో ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో LSG 8 వికెట్ల నష్టానికి 203 రన్స్ చేసింది. మార్ష్(31 బంతుల్లో 60), మార్క్రమ్ (38 బంతుల్లో 53), బదోనీ (19 బంతుల్లో 30) రాణించారు. ముంబై బౌలర్లలో పాండ్య 5 వికెట్లతో చెలరేగారు. బౌల్ట్, అశ్వనీ కుమార్, పుతూర్ తలో వికెట్ తీశారు. ముంబై విజయ లక్ష్యం 204 పరుగులు.

బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. శ్రీరామ నవమి సందర్భంగా ఎల్లుండి ఉదయం 11.45 గంటలకు పెద్ది ఫస్ట్ షాట్తోపాటు రిలీజ్ డేట్ గ్లింప్స్ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. మ్యూజిక్ మిక్సింగ్ పూర్తయ్యిందంటూ ఏఆర్ రెహమాన్తో దిగిన ఫొటోను బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నేపాల్లో భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమికి 20 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఢిల్లీ-NCRతో సహా ఉత్తర భారతంలో పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. ఇటీవల మయన్మార్లో భూకంపం ధాటికి 3వేల మందికి పైగా ప్రజలు మరణించిన విషయం తెలిసిందే.

TG: సాగు నీటి ప్రాజెక్టులపై AP ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేంద్ర సంస్థలు, బోర్డుల అనుమతి లేకుండా నిబంధనలను ఉల్లంఘించి రాయలసీమ ఎత్తిపోతల, బనకచర్ల ప్రాజెక్టులపై ముందుకెళ్తోందని చెప్పారు. వాటిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. ఈ విషయంపై స్టాండింగ్ కౌన్సిల్, AGతో ఆయన సంప్రదింపులు జరిపారు. ఆ ప్రాజెక్టులతో తెలంగాణకు నష్టం వాటిల్లుతుందన్నారు.

ట్రంప్ తమపై విధించిన సుంకాలకు ప్రతీకారంగా చైనా కూడా 34శాతం టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. దానిపై ట్రంప్ స్పందించారు. ‘వారు మాపై సుంకాలు విధించలేరు. అది వారికి మంచిదికాదు. కానీ టెన్షన్ పడ్డారు. తప్పటడుగు వేశారు’ అని తన ట్రూత్ సోషల్లో వ్యాఖ్యానించారు. సుంకాలతో పాటు అరుదైన వనరుల ఎగుమతులపై, రక్షణ రంగ సంబంధితమైన 30 అమెరికా కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది.

గత నెల 30న రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో గాయపడిన CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా కోలుకోలేదని సమాచారం. రేపు ఢిల్లీతో మ్యాచ్కు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ధోనీ మరోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై యాజమాన్యం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

AP: బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యాధి నిరోధకశక్తి లేకపోవడం, లెప్టోస్పీరోసిస్ తదితర కారణాల వల్ల ఈ వ్యాధి సోకి ఇటీవల ఓ బాలిక మృతి చెందిందని చెప్పారు. దీనిపై ICMR బృందం అధ్యయనం చేసిందన్నారు. కాగా ఆ బృందంతో సీఎం ఇవాళ సమీక్షించారు.

ఎయిర్ ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 25 నుంచి మే 24 వరకు అన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసినవారు అర్హులు. జీతం రూ.40వేల నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు. వయసు 27 ఏళ్లు కాగా రిజర్వేషన్ల మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ <

AP: రాష్ట్రంలోని 352 KGBVల్లో ఆరో తరగతి, ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 7, 8, 9, 10, ఇంటర్ సెకండియర్లో మిగిలిన సీట్లకు అప్లై చేసుకోవాలని సమగ్రశిక్ష సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. అనాథలు, డ్రాపౌట్స్, SC, ST, BC, మైనార్టీ బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వెబ్సైట్: https://apkgbv.apcfss.in/
Sorry, no posts matched your criteria.