India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇది సరికొత్త యుగానికి నాంది అన్నారు. మద్దతు తెలిపిన ప్రజలు, చర్చల్లో పాల్గొన్న ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత లోపించిందన్నారు. ఇది ముస్లిం మహిళలు, పేదలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఇకపై ఈ పరిస్థితి మారుతుందని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడి గౌరవానికి ప్రాధాన్యమిస్తామని ఉద్ఘాటించారు.

AP: రాజమండ్రిలోని బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో 12 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఫార్మసీ విద్యార్థిని నాగ అంజలి మృతిచెందారు. ఇవాళ తెల్లవారుజామున స్ట్రోక్ రావడంతో ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఓ వ్యక్తి చేతిలో మోసపోయానని గత నెల 23న ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. TGలోని ములుగు, వరంగల్, వికారాబాద్, RR, మేడ్చల్, యాదాద్రి, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. APలోని అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

TG: ప్రస్తుత యాసంగిలోనూ సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నాయకన్గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మాట్లాడారు. గత వానాకాలం సీజన్లో క్వింటాకు రూ.500 చొప్పున మొత్తం రూ.1700 కోట్ల బోనస్ అందజేశామన్నారు. దేశంలో రైతులకు బోనస్ ఇస్తున్న తొలి ప్రభుత్వం తమదేనన్నారు. వరి దిగుబడిలో ఏపీని తెలంగాణ అధిగమించిందని పేర్కొన్నారు.

లింక్డిన్ కోఫౌండర్ హాఫ్మన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టార్టప్ కంపెనీలకు ‘వర్క్ లైఫ్ బ్యాలెన్స్’ పనికిరాదన్నారు. ఎవరైనా ఆ మాట చెబితే వారికి స్టార్టప్ గురించి అవగాహన లేనట్లేనని చెప్పారు. అంకుర సంస్థలు సక్సెస్ అవ్వాలంటే ఉద్యోగులు నిరంతరం పనిచేయాల్సిందేనన్నారు. ‘ఇంటికి వెళ్లి ఫ్యామిలీతో డిన్నర్ చేసి మళ్లీ పని మొదలుపెట్టండి’ అని లింక్డిన్ స్థాపించిన కొత్తలో ఉద్యోగులకు చెప్పేవాళ్లమని వెల్లడించారు.

IPL-2025 సీజన్లో కమిన్స్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. నిన్న ఈడెన్ గార్డెన్స్లో KKRపై మ్యాచులో సరిగా బౌలింగ్ మార్పులు చేయలేకపోయారు. స్పిన్నర్లు రెండు వికెట్లు తీసినా వారిని కంటిన్యూ చేయలేదు. 8 ఓవర్లు స్పిన్నర్లు వేసేందుకు ఛాన్స్ ఉన్నా పేసర్లతో వేయించి మూల్యం చెల్లించుకున్నారు. మరోవైపు కేకేఆర్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ కలిసి 8 ఓవర్లలో 4 వికెట్లు తీసి SRHను దెబ్బకొట్టారు.

TG: రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కొనసాగుతోంది. 3 రోజుల్లో దాదాపు 41వేల టన్నులకు పైగా బియ్యాన్ని సరఫరా చేసినట్లు సమాచారం. సన్నబియ్యం ఇస్తుండడంతో రేషన్ షాపులకు జనం భారీగా వస్తున్నారు. దీంతో మేడ్చల్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లోని దుకాణాల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. మళ్లీ స్టాక్ తెప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మీరు బియ్యం తెచ్చుకున్నారా? క్వాలిటీ ఎలా ఉంది?

SRH నిన్న KKRతో ఓడిపోయి ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. 2023 నుంచి ఒకే జట్టుపై వరుసగా 5సార్లు ఓడిపోయింది. 2023లో 1, 2024లో 3, నిన్న కోల్కతా మ్యాచ్లో పరాజయాలు చవిచూసింది. మరోవైపు, ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచుల్లోనూ 3 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. గతంతో పోలిస్తే SRH పటిష్ఠంగానే కనిపిస్తున్నా వరుస ఓటములు ఊహించనివి. టాప్ ఆర్డర్ వైఫల్యమే ఆ జట్టుకు శాపంగా కన్పిస్తోంది.

AP: ఎయిడ్స్ నియంత్రణలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మంచి పనితీరు కనబరిచింది. గతేడాది వరకు 17వ స్థానంలో ఉన్న ఏపీ ప్రస్తుతం 7వ ప్లేస్కు చేరినట్లు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(న్యాకో) తెలిపింది. 2024 APR- DEC మధ్య మంచి పనితీరు కనబరిచినట్లు చెప్పింది. 2004 నుంచి రాష్ట్రంలో దాదాపు 2,25,000 మంది బాధితుల్ని గుర్తించినట్లు వెల్లడించింది. వ్యాధి నియంత్రణకు రూ.127cr ఖర్చు చేసినట్లు న్యాకో పేర్కొంది.

IPLలో పేలవ ఫామ్ను కొనసాగిస్తున్న రోహిత్ శర్మను MI తుది జట్టు నుంచి తప్పించాలన్న కామెంట్లపై బ్యాటింగ్ కోచ్ పొలార్డ్ స్పందించారు. ‘ఈ ఆటలో రోహిత్ ఒక లెజెండ్. U19 నుంచి అతడితో ఆడుతున్నా. విభిన్న పరిస్థితుల్లో, వేర్వేరు ఫార్మాట్లలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఆటను ఆస్వాదించే హక్కును పొందాడు. క్రికెట్లో తక్కువ స్కోర్లకు ఔటవ్వడం సహజం. అతడు పెద్ద స్కోర్ చేసినప్పుడు మనం ప్రశంసిస్తాం’ అని అన్నారు.
Sorry, no posts matched your criteria.