news

News April 4, 2025

నేటి నుంచి సబ్ రిజస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్

image

AP: రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి వేచి చూడకుండా నేటి నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుంది. దీంతో స్లాట్‌ బుక్ చేసుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్తే చాలు. ఇప్పటికే కృష్ణా (D)లో ఈ విధానం పైలట్‌ ప్రాజెక్ట్‌గా అమలు అవుతోంది. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొత్త విధానం అందుబాటులోకి రానుంది. మంత్రి అనగాని సచివాలయం నుంచి ఈ సేవలను ప్రారంభిస్తారు.

News April 4, 2025

మరో నెల రోజులు ఆస్పత్రిలోనే కొడాలి నాని

image

AP: YCP నేత కొడాలి నాని బైపాస్ సర్జరీ విజయవంతమైనట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ‘ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ సర్జన్ రమాకాంత్ పాండే 8 నుంచి 10 గంటల పాటు శ్రమించి సర్జరీ చేశారు. ఆయన అవయవాలన్నీ బాగానే స్పందిస్తున్నాయి. కొన్ని రోజులపాటు ఆయన ఐసీయూలోనే ఉంటారు. ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో నెల రోజులపాటు నాని ముంబైలోనే ఉండనున్నారు, త్వరలోనే కోలుకుని తిరిగి వస్తారు’ అని తెలిపారు.

News April 4, 2025

IPL: రూ.23.75 కోట్లు పెట్టింది ఇందుకే..

image

మెగా వేలంలో రూ.23.75 కోట్లకు అమ్ముడైన వెంకటేశ్ అయ్యర్ ఈ సీజన్లోని తొలి మూడు మ్యాచుల్లో పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డారు. నిన్న SRHపై తిరిగి ఫామ్ అందుకున్నారు. 29 బంతుల్లోనే 3 సిక్సర్లు, 7 ఫోర్లతో 60 రన్స్ చేశారు. ఆరంభంలో స్లోగా ఆడిన అతడు.. చివరి ఓవర్లలో రింకూతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. SRHపై వెంకీకి మంచి రికార్డు ఉంది. ఆరెంజ్ ఆర్మీపై 9 మ్యాచుల్లో 152 స్ట్రైక్ రేటుతో 208 రన్స్ చేశారు.

News April 4, 2025

రాష్ట్రంలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు

image

AP: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగి, రూ.30 వేలకు కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. 2024-25లో సగటున రోజుకు రూ.83.38కోట్ల విలువైన మద్యం తాగేశారు. అయితే ప్రభుత్వం లిక్కర్ ధర తగ్గించడంతో అమ్మకాలు పెరిగినా రాబడి పెద్దగా లేదు. దీంతో గతేడాదితో పోలిస్తే విక్రయాల్లో 9.1 శాతం పెరుగుదల కనిపించినా.. విలువ 0.34 శాతం మాత్రమే పెరిగింది. అత్యధికంగా కర్నూలు, అత్యల్పంగా కడప జిల్లాలో అమ్మకాలు జరిగాయి.

News April 4, 2025

వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకం: కిషన్‌రెడ్డి

image

వక్ఫ్ సవరణ(UMEED) బిల్లు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందడం చరిత్రాత్మకమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వక్ఫ్ సంస్థల్లో మెరుగైన గవర్నెన్స్, పారదర్శకత, అవినీతి నిర్మూలనకు ఈ బిల్లు ఉపకరిస్తుందని ఉద్ఘాటించారు. ముస్లిం మహిళలకు, ఆ కమ్యూనిటీలోని పస్మాందాస్, అఘాఖానీస్‌‌కు లబ్ధి చేకూరుస్తుందని పేర్కొన్నారు. పీఎం మోదీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News April 4, 2025

‘ఇంపాక్ట్’ చూపించి SRHను ఓడించాడు

image

IPL: కోల్‌కతాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్‌ను KKR ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ అరోరా కోలుకోలేని దెబ్బతీశారు. ముగ్గురు విధ్వంసకర ఆటగాళ్లు హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్ వికెట్లు పడగొట్టి హైదరాబాద్ ఓటమిని శాసించారు. POTM అవార్డు సొంతం చేసుకున్నారు. SRH హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది.

News April 4, 2025

ఇంటిమేట్ సీన్‌లో ఓ నటుడు హద్దు మీరాడు: హీరోయిన్ అనుప్రియ

image

తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను హీరోయిన్ అనుప్రియా గోయెంకా పంచుకున్నారు. ఓ ముద్దు సీన్‌లో తాను ఇబ్బంది పడ్డట్లు చెప్పారు. ‘ఓ సినిమాలో కిస్సింగ్ సీన్ చేస్తున్నా. ఆ సమయంలో ఓ నటుడు నా నడుము పట్టుకోవాల్సి ఉంది. స్క్రిప్టులోనూ అదే ఉంది. కానీ అతడు మరో చోట అసభ్యకరంగా తాకడంతో ఇబ్బంది పడ్డా. వెంటనే అతడిని ప్రశ్నించలేకపోయా. కానీ ఆ తర్వాతి టేక్‌లో మాత్రం అలా చేయొద్దని హెచ్చరించా’ అంటూ చెప్పుకొచ్చారు.

News April 4, 2025

కుంభమేళాతో రూ.2.80 లక్షల కోట్ల బిజినెస్

image

ప్రయాగ్ రాజ్‌లో జరిగిన కుంభమేళాతో దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి ప్రోత్సాహం లభించినట్లు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నివేదిక తెలిపింది. ఈ మేళా వల్ల రూ.2.8 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలు జరిగినట్లు వెల్లడించింది. కొనుగోళ్ల రూపంలో రూ.90,000 కోట్లు, ఎయిర్‌లైన్స్, హోటళ్లు తదితర రంగాల ద్వారా రూ.80,000 కోట్ల వ్యాపారం జరిగినట్లు పేర్కొంది. రోజూవారీ అవసరాల కోసం రూ.1.1 లక్షల కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిపింది.

News April 4, 2025

ఈ నెల 7 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

image

AP: ఈ నెల 7 నుంచి రాష్ట్రంలోని అన్ని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో NTR వైద్య సేవలను నిలిపేస్తున్నట్లు ఏపీ స్పెషాల్టీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వం నుంచి రూ.3,500 కోట్ల బకాయిలు రావాలని, దీంతో ఆస్పత్రుల నిర్వహణ చేయలేకపోతున్నామని వెల్లడించింది. గతేడాది ఏప్రిల్ బకాయిలు కూడా ఇవ్వలేదని, చేసిన అప్పులు తీర్చలేకపోతున్నామని పేర్కొంది. ప్రభుత్వం స్పందించి రూ.1,500 కోట్లు మంజూరు చేయాలని కోరింది.

News April 4, 2025

IPL: నేడు లక్నోతో ముంబై అమీతుమీ

image

IPLలో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. రాత్రి 7.30 గంటలకు లక్నో వేదికగా ముంబై, లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. తమకు అలవాటైన రీతిలోనే MI తొలుత వరుసగా మ్యాచులు ఓడింది. కానీ సొంతగడ్డపై KKRను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. అటు లక్నో కూడా 2 మ్యాచులు ఓడి ఒకదాంట్లో గెలిచింది. చివరిగా PBKSపై ఆ జట్టు చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఇవాళ ముంబైని ఓడించి మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది.