news

News April 3, 2025

నా వయసును నమ్మలేకపోతున్నాను: రష్మిక

image

ఈ నెల 5న 29వ పుట్టినరోజు చేసుకోనున్నట్లు హీరోయిన్ రష్మిక ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 29 ఏళ్లనే విషయం తనకే నమ్మశక్యంగా లేదని పేర్కొన్నారు. ఇది తన బర్త్ డే మంత్ అని పేర్కొంటూ వయసు పెరిగే కొద్దీ పుట్టినరోజును జరుపుకునేందుకు మరింత ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ బ్యూటీ కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె నటించిన ‘సికందర్’ ఇటీవల థియేటర్లలో విడుదలైంది.

News April 3, 2025

SRHకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానం

image

HCAతో SRHకు వివాదం నెలకొన్న వేళ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ACA) సన్‌రైజర్స్ జట్టును APకి ఆహ్వానించింది. ఈ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లను విశాఖలో నిర్వహించాలని కోరింది. పన్ను మినహాయింపులు కూడా ఇస్తామని ఆఫర్ చేసింది. కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో SRH, HCA మధ్య వివాదం నెలకొనగా సీఎం రేవంత్ ఆదేశాలతో HCA దిగొచ్చింది. మరోవైపు ఈ సీజన్‌లో విశాఖలో 2 IPL మ్యాచ్‌లు జరిగిన విషయం తెలిసిందే.

News April 3, 2025

ట్రంప్ టారిఫ్‌లు ఎదురుదెబ్బ కాదు: కేంద్ర ప్రభుత్వ వర్గాలు

image

భారతదేశ దిగుమతులపై అమెరికా 26% టారిఫ్ విధించడాన్ని తాము ఎదురుదెబ్బగా భావించట్లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇది మిశ్రమ ఫలితమే అని తేల్చి చెప్పాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్య సమస్యలను పరిష్కరిస్తే ఈ టారిఫ్‌లు తగ్గే అవకాశం ఉందని వెల్లడించాయి. ఈ మేరకు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని వివరించాయి. మరోవైపు, మన దేశ ఫార్మా ఉత్పత్తులకు టారిఫ్ నుంచి ట్రంప్ మినహాయింపు ఇచ్చారు.

News April 3, 2025

ఎమ్మెల్సీగా ప్రమాణం.. పవన్ కళ్యాణ్‌ను కలిసిన నాగబాబు

image

AP: ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన నేత నాగబాబు విజయవాడలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. నాగబాబుకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. నిన్న నాగబాబు సీఎం చంద్రబాబు, తన సోదరుడు చిరంజీవితో భేటీ అయ్యారు.

News April 3, 2025

ట్రంప్ టారిఫ్స్‌పై ప్రపంచ దేశాధినేతల కామెంట్స్

image

యూఎస్ చీఫ్ ట్రంప్ టారిఫ్స్‌పై ప్రపంచ నేతలు పెదవి విరుస్తున్నారు. యూరోపియన్ యూనియన్‌పై 20% టారిఫ్ విధించడాన్ని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తప్పు పట్టారు. మరోవైపు ట్రంప్ టారిఫ్ అన్యాయంగా ఉందని ఆస్ట్రేలియా పీఎం అల్బనీస్ వ్యాఖ్యానించారు. యూఎస్ బాస్ నిర్ణయంతో ఏ ఒక్కరికి ప్రయోజనం లేదని ఐర్లాండ్ ప్రధాని మార్టిన్ అన్నారు. ట్రంప్‌కు దీటుగా బదులిస్తామని చైనా ప్రభుత్వం హెచ్చరించింది.

News April 3, 2025

బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్!

image

బంగారం ధరలు ఇవాళ కూడా పెరగడంతో ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.500 పెరిగి రూ.85,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.540 పెరగడంతో రూ.93,380 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,13,900గా ఉంది. గత తొమ్మిది రోజుల్లో గోల్డ్ రేటు రూ.4090 పెరగడం గమనార్హం.

News April 3, 2025

ఢిల్లీ చెత్త రికార్డును సమం చేసిన ఆర్సీబీ

image

నిన్నటి మ్యాచులో గుజరాత్ చేతిలో పరాజయంతో ఆర్సీబీ ఖాతాలో చెత్త రికార్డు చేరింది. ఒకే వేదికపై అత్యధిక మ్యాచులు ఓడిన జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ చెత్త రికార్డును సమం చేసింది. చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటివరకు 92 మ్యాచులు ఆడిన RCB 44 మ్యాచుల్లో ఓడింది. కాగా DC ఢిల్లీలో 82 మ్యాచులు ఆడి 44 మ్యాచుల్లో ఓడటం గమనార్హం.

News April 3, 2025

మగాళ్ల కంటే ఆడవారికే వినికిడి శక్తి ఎక్కువ!

image

మగాళ్లతో పోలిస్తే మహిళలకు వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుందని ఓ రీసెర్చ్‌లో తేలింది. ఏ ప్రాంతమైనా, వయస్సుల్లో తేడాలు ఉన్నా అతివలే అన్ని రకాల శబ్దాలు మెరుగ్గా వింటారని వివరించింది. పురుషులు, మహిళల మధ్య ఈ తేడా 2 డెసిబుల్స్ వరకు ఉంటుందని పేర్కొంది. ఆడవారి చెవి నిర్మాణంలోని సూక్ష్మమైన తేడాల వల్ల ఇది సాధ్యమైనట్లు రీసెర్చ్ వెల్లడించింది. అలాగే ఎడమ చెవి కంటే కుడి చెవి సున్నితంగా ఉంటుందని చెప్పింది.

News April 3, 2025

STOCK MARKETS: నష్టాలతో ఆరంభం

image

భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో మొదలయ్యాయి. ట్రంప్ టారిఫ్స్ ప్రకటించిన నేపథ్యంలో ఏషియా మార్కెట్లకు నష్టాలు తప్పవన్న నిపుణుల అంచనాలతో మదుపర్లు అప్రమత్తమయ్యారు. సెన్సెక్స్ 457 పాయింట్లు కోల్పోయి 76,160 వద్ద నష్టాల్లో కొనసాగుతోంది. నిఫ్టీ 117 పాయింట్లు నష్టపోయి 23,215 వద్ద ట్రేడవుతోంది. IT, AUTO షేర్లపై ప్రభావం ఎక్కువగా ఉంది. Dr.Reddys టాప్ గెయినర్ కాగా TCS షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News April 3, 2025

టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్

image

TG: వార్షిక పరీక్షలు రాసిన టెన్త్ విద్యార్థులకు రేపు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉ.10-12 గంటల వరకు T-SAT, యూట్యూబ్ ఛానెల్‌లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడం, కెరీర్ ఆప్షన్స్ వంటి విషయాలపై సీనియర్ ఐఏఎస్ అధికారులు అవగాహన కల్పిస్తారు.