news

News March 27, 2025

కిలో రూ.3.. కష్టాల్లో టమాటా రైతులు

image

TG: గిట్టుబాటు ధరలు లేక, కిలో టమాటా రూ.3కే అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. రంగారెడ్డి (D) కొందుర్గ్ (M) రైతు నర్సింహులు 56 టమాటా పెట్టెలు(ఒక్కోదాంట్లో 30kg) మహబూబ్‌నగర్ రైతు‌బజారుకు తీసుకెళ్లారు. 39పెట్టెలకు దళారులు రూ.3,500 చెల్లించారు. మిగతావి కొనకపోవడంతో టమాటాలను రోడ్డుపక్కన పారబోస్తూ ఆవేదన చెందారు. మరోవైపు, బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ.10- రూ.20 వరకు ఉంది.

News March 27, 2025

‘తెలుగు నేర్చుకో..’ అక్బరుద్దీన్ ఒవైసీపై మాజీ ఐఏఎస్ ఫైర్

image

TG: ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే <<15896404>>అక్బరుద్దీన్‌పై<<>> మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ ఫైరయ్యారు. ‘మంత్రి సీతక్కకు హిందీ రాదు సరే.. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన నీకు తెలుగు ఎందుకు రాదు?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మాట్లాడే తొలి అధికార భాష తెలుగును నేర్చుకోవాలనే బాధ్యత ఉండాలని హితవు పలికారు. తెలుగు రానప్పుడు సభ్యులు లేవనెత్తే సమస్యలు ఎలా అర్థమవుతాయని దుయ్యబట్టారు.

News March 27, 2025

విక్రమ్ ‘వీర ధీర శూర’కు లైన్ క్లియర్

image

అనివార్య కారణాలతో ఇవాళ మార్నింగ్ షోలు రద్దయిన ‘వీర ధీర శూర’ చిత్రానికి ఊరట లభించింది. ఈవినింగ్ షో నుంచి సినిమా ప్రదర్శన ఉంటుందని తెలుగు డిస్ట్రిబ్యూటర్ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఇప్పటికే రద్దైన షోలకు డబ్బులు తిరిగిస్తామని సినీ ప్రేక్షకులకు థియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్, దుషారా విజయన్ , ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు.

News March 27, 2025

ఈ ఏడాది చివరి నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి: సీఎం

image

AP: గత ప్రభుత్వం రాజకీయ కక్షతో పోలవరం ప్రాజెక్టు పనులను ఆపేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ‘గత ప్రభుత్వం కాఫర్ డ్యాంలను సకాలంలో నిర్మించకపోవడంతో రూ.440 కోట్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దీంతో మళ్లీ కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాల్సి వచ్చింది. దాన్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తాం. 2026 ఫిబ్రవరి నాటికి ECRF గ్యాప్-1, 2027 జూన్ నాటికి ECRF గ్యాప్-2 పూర్తి చేస్తాం’ అని మీడియాతో చెప్పారు.

News March 27, 2025

సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

image

TG: రాష్ట్రంలో ఎక్కడైనా 100% రుణమాఫీ జరిగిందా అని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని KTR నిలదీశారు. సిరిసిల్ల లేదా కొడంగల్‌లో ఎక్కడైనా నిరూపిస్తారా అని ప్రశ్నించారు. నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని CM రేవంత్‌కు సవాల్ విసిరారు. మరోవైపు అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడం సబబేనా అని ప్రశ్నించారు. ఒకరిని జైలుకు పంపే అధికారం CMకు ఉండదని, నేరాలు నిర్ధారించి జైలుకు పంపేది కోర్టులని స్పష్టం చేశారు.

News March 27, 2025

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు కెప్టెన్‌‌గా రోహిత్..?

image

జూన్‌లో ప్రారంభమయ్యే ఇంగ్లండ్‌-భారత్ టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో భారత్ ఓడిపోవడంతో పాటు హిట్ మ్యాన్‌ విఫలమవడంతో టెస్ట్‌లకు కెప్టెన్‌గా తప్పిస్తారని ప్రచారం జరిగింది. కాగా ఈ సిరీస్‌కు రోహితే కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే హిట్ మ్యాన్ అభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు.

News March 27, 2025

వంశీ బెయిల్ పిటిషన్ డిస్మిస్

image

AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఏ71గా ఉన్న ఆయన ప్రస్తుతం అరెస్టై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వాలని వంశీ విజయవాడ కోర్టును ఆశ్రయించగా ఇరువైపులా వాదనలు ముగిశాయి. ఈ క్రమంలోనే ధర్మాసనం ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

News March 27, 2025

SRH మ్యాచ్.. వార్నర్ ఆసక్తికర ట్వీట్

image

నేడు ఉప్పల్ వేదికగా SRH, LSG మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ సన్ రైజర్స్ 300 పరుగులు చేస్తుందా? అని Xలో ప్రశ్నించారు. ఈ మ్యాచ్ చూసేందుకు ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అభిషేక్ శర్మ 100, హెడ్ 20 బంతుల్లో 50 పరుగులు చేస్తారని అంచనా వేశారు. కాగా గతంలో SRH సారథిగా వ్యవహరించిన వార్నర్ ఆ జట్టుకు ట్రోఫీ అందించారు.

News March 27, 2025

కేసీఆర్ దిగిపోయే నాటికి రూ.8.19 లక్షల కోట్ల అప్పు: CM రేవంత్

image

TG: కేసీఆర్ దిగిపోయే నాటికి అన్ని అప్పులు కలిపితే రూ.8.19 లక్షల కోట్లు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. తాము 15 నెలల్లో రూ.1.58 లక్షల కోట్లు అప్పు చేశామని, ఇందులో రూ.1.53 లక్షల కోట్లు పాత అప్పులకే చెల్లించామని స్పష్టం చేశారు. కూలిపోయిన కాళేశ్వరానికి కూడా రూ.5 వేల కోట్లకు పైగా చెల్లించామన్నారు. గత ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతుభరోసా పథకాలను సరిగా అమలు చేయలేదని విమర్శించారు.

News March 27, 2025

Stock Markets: భారీ లాభాలు..

image

స్టాక్‌మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ 23,591 (+105), సెన్సెక్స్ 77,606 (+317) వద్ద ముగిశాయి. PSU బ్యాంకు, మీడియా, ఎనర్జీ, చమురు, రియాల్టి, PSE, కమోడిటీస్, ఫైనాన్స్, బ్యాంకు, మెటల్, ఇన్ఫ్రా షేర్లు ఎగిశాయి. ఆటో, ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు ఎరుపెక్కాయి. హీరోమోటో, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, HDFC లైఫ్ టాప్ గెయినర్స్. టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఐచర్ మోటార్స్ టాప్ లూజర్స్.