India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తొలి స్వదేశీ MRI మెషీన్ను భారత్ అభివృద్ధి చేసినట్లు ఎయిమ్స్ ఢిల్లీ తెలిపింది. అక్టోబర్ నుంచి ట్రయల్స్ కోసం ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో టెస్టుల ఖర్చులతో పాటు విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశముందని వెల్లడించింది. ఈ మెషీన్ వైద్య సాంకేతికతలో భారత్ను స్వావలంబన దిశగా నడిపించడంలో సహాయపడనుంది.

2021లో AUSపై గబ్బా స్టేడియం(బ్రిస్బేన్)లో టీమ్ఇండియా టెస్టు విజయం అపూర్వమైనది. 130ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్టేడియాన్ని 2032 ఒలింపిక్స్ తర్వాత కూల్చివేయనున్నట్లు క్వీన్స్లాండ్ ప్రభుత్వం తెలిపింది. 1895లో నిర్మించిన ఈ స్టేడియం శిథిలావస్థకు చేరింది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2032తర్వాత క్రికెట్ మ్యాచులన్నీ బ్రిస్బేన్ విక్టోరియా పార్క్ వద్ద నిర్మించనున్న స్టేడియంలో నిర్వహిస్తారు.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-CRRIలో 209 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం, ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సెక్రటేరియట్ అసిస్టెంట్కు రూ.19,900-63,200, జూనియర్ స్టెనోగ్రాఫర్కు రూ.25,500-81,000 జీతం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ.500. ఏప్రిల్ 21 వరకు <

IPL మ్యాచ్లు భారీగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఈ నెల 22న KKR, RCB జట్ల మధ్య మ్యాచ్తో సీజన్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 4 మ్యాచులు అలరించాయి. కాగా, స్టార్స్పోర్ట్స్లో 25.3 కోట్లు, జియో హాట్స్టార్లో 137 కోట్ల వ్యూస్ వచ్చినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. అలాగే 5K కోట్ల నిమిషాల వాచ్ టైం నమోదైనట్లు వెల్లడించాయి. ధనాధన్ ఆటతో అలరిస్తున్న IPL ఏటికేడు భారీ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంటోంది.

భార్యతో సాన్నిహిత్యంగా గడిపిన వీడియోలను ఇతరులకు షేర్ చేసే అర్హత భర్తకు లేదని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇది భార్యాభర్తల మధ్య బంధాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. భార్యకు భర్త యజమాని కాదని, ఆమెకంటూ సొంత హక్కులు, కోరికలు ఉంటాయని తెలిపింది. తామిద్దరం కలిసున్న వీడియోలను తన భర్త వీడియో తీసి FBలో అప్లోడ్ చేయడంపై ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

స్టార్హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సెటిల్మెంట్ ప్రాక్టీసెస్లో తప్పిదాలను IRDAI గుర్తించినట్టు తెలిసింది. విచారణ ముగిశాక సంస్థపై చర్యలు తీసుకుంటుందని సమాచారం. 8-10 జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో IRDAI రీసెంటుగా తనిఖీలు చేపట్టింది. క్లెయిమ్స్ తిరస్కరణ, ఆమోదం, లేవనెత్తిన సందేహాలు, డిడక్షన్లను పరిశీలించింది. మరోవైపు స్టార్హెల్త్కు వేర్వేరు జోనల్ ఆఫీసుల నుంచి 25GST నోటీసులు రావడం గమనార్హం.

AP: వచ్చే ఐదేళ్లలో అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని కలెక్టర్ల సదస్సులో పునరుద్ఘాటించారు. ఇప్పటికే స్థలం పొందిన వారు కోరిన విధంగా ఇంటి పట్టాలు, నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

క్రిష్ జాగర్లమూడి, అనుష్క కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఘాటి’. ఈ సినిమా విడుదల ఆలస్యం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. వీఎఫ్ఎక్స్ పనులే ఆలస్యానికి కారణమని వెల్లడించాయి. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉంది. కొత్త రిలీజ్ డేట్ను త్వరలోనే వెల్లడించే అవకాశముంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్లో అనుష్క లుక్ భయపెట్టేలా ఉంది.

AP: వివేకా హత్య కేసుపై SCలో రాష్ట్ర ప్రభుత్వం అదనపు అఫిడవిట్ వేసింది. ‘MP అవినాశ్ చెప్పినట్లే సునీత, నర్రెడ్డిపై CBI అధికారి రాంసింగ్ కేసు నమోదు చేశారు. సునీత, నర్రెడ్డి, రాంసింగ్పై వివేకా PA కృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసును IO రాజు విచారించలేదు. తనను అవినాశ్ బెదిరించారని రాజు అంగీకరించారు. రిటైర్డ్ ASP రాజేశ్వరరెడ్డి, ASIG రామకృష్ణారెడ్డి కేసు మొత్తాన్ని నడిపించారు’ అని పేర్కొన్నట్లు సమాచారం.

AP: ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరు వరకు ప్రాపర్టీ ట్యాక్స్పై పెండింగ్లో ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ఇస్తూ జీవో జారీ చేసింది. ప్రజల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల కొన్నేళ్లుగా పేరుకుపోయిన రూ.కోట్ల బకాయిలు వసూలవుతాయని అధికారులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.