India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కన్నతల్లికి వృద్ధాప్యంలో చేయూతనిచ్చేందుకు నిరాకరించిన కొడుకుపై హరియాణా హైకోర్టు సీరియస్ అయింది. 77 ఏళ్ల తల్లికి ప్రతినెలా రూ.5000 ఇవ్వాలని దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ వ్యక్తి హైకోర్టుకు వెళ్లారు. దీనిపై జస్టిస్ జస్గుర్ప్రీత్ సింగ్ తీర్పునిస్తూ.. కలియుగానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. 3 నెలల్లో తల్లి పేరుపై రూ.50వేలు డిపాజిట్ చేసి, ప్రతినెలా రూ.5వేలు చెల్లించాలని ఆదేశించారు.

రష్యాలో ఓ వ్యక్తి ప్రేమికుల రోజున తన భార్యకు ఖరీదైన రూ.27 లక్షల పోర్షే కారును బహుమతిగా ఇచ్చారు. దానికి చిన్నచిన్న డ్యామేజ్లు ఉండటంతో తనకు నచ్చలేదని తిరస్కరించింది. విసుగెత్తిన భర్త ఆ కారును డంపింగ్ యార్డులో పడేశారు. అయితే ఈ వెహికల్ దగ్గర చాలామంది ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ప్రాంతం టూరిస్ట్ స్పాట్గా మారింది. దీంతో రెండు వారాలు గడిచినా అధికారులు ఆ కారును తీసే ప్రయత్నం చేయట్లేదు.

US వర్సిటీల్లో గ్రాడ్యుయేట్లు అయ్యే భారతీయులను అమెరికన్ కంపెనీలు ఇకపై ‘గోల్డ్ కార్డు’ కింద నియమించుకోవచ్చని Prez డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘భారత్, చైనా సహా వేర్వేరు దేశాల నుంచి హార్వర్డ్ వంటి వర్సిటీలకు స్టూడెంట్స్ వస్తున్నారు. టాపర్లుగా అవతరించి జాబ్ ఆఫర్లు కొట్టేస్తున్నారు. వారు దేశంలో ఉంటారో లేదో తెలీదు కాబట్టి వెంటనే రిజెక్ట్ చేస్తున్నారు. గోల్డ్ కార్డుతో ఆ ఇబ్బంది తొలగిపోతుంది’ అని అన్నారు.

బ్రిటిష్ పాలకులను గజగజలాడించిన చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి నేడు. 1906 జులై 23న మధ్యప్రదేశ్ అలీరాజ్పూర్ జిల్లాలో జన్మించిన ఈయన.. చిన్న వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. బ్రిటిషర్ల నుంచి భరతమాతకు విముక్తి కల్పించేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. భగత్ సింగ్తో చేయి కలిపి అతని సాయుధ విభాగానికి కమాండర్ ఇన్ చీఫ్గా వ్యవహరించారు. 1931లో 24 ఏళ్లకే వీరమరణం పొందారు.

ముస్తాఫారాజ్ అనే వ్యక్తితో తన వివాహం జరిగినప్పుడు తనపై లవ్జిహాద్ ఆరోపణలు చేశారని నటి ప్రియమణి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పుట్టబోయే పిల్లలని ఐసిస్లో చేరుస్తారా అంటూ కామెంట్లు చేయటం తనను బాధకు గురిచేస్తోందన్నారు. తన భర్తతో ఉన్న ఫోటో షేర్ చేస్తే 10లో 9నెగటివ్ కామెంట్లే ఉంటాయన్నారు. చాలా మంది కులం, మతం గురించే మాట్లాడతారని వాపోయారు. కాగా 2017లో ప్రియమణి, ముస్తాఫా మతాంతర వివాహం చేసుకున్నారు.

పార్క్ అనగానే పచ్చని చెట్లు, సేదతీరేందుకు కుర్చీలు, వాకింగ్ ట్రాక్లు గుర్తొస్తాయి. అయితే, కేవలం 50CMS మాత్రమే ఉన్న అతిచిన్న పార్కు గురించి మీరెప్పుడైనా విన్నారా? జపాన్ షిజుయోకాలోని నాగిజుమి టౌన్లో 0.24 చదరపు మీటర్లలో A3 పేపర్ షీట్లా ఈ ఉద్యానవనం ఉంటుంది. దీనిని 1988లో నిర్మించగా 2024లో సిటీ పార్కుగా మారింది. ఇది ప్రపంచంలోనే అతిచిన్న పార్క్గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది.

IIT రాంచీ వెబ్కాస్టులో మాట్లాడుతుండగా సిస్టమ్ను ఎవరో హ్యాక్ చేసి పోర్న్ ప్లే చేశారన్న శామ్ పిట్రోడా ఆరోపణలను EDU మినిస్ట్రీ ఖండించింది. ‘అసలు రాంచీలో IITనే లేదు. అక్కడుంది IIIT. పిట్రోడాను ఫిజికల్/డిజిటల్గా లెక్చరివ్వడానికి పిలవలేదని వారూ స్పష్టం చేశారు. దీన్ని బట్టి IITలను అపఖ్యాతి పాలు చేయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. మేం దీనిని సహించం. లీగల్ యాక్షన్ తీసుకుంటాం’ అని ట్వీట్ చేసింది.

చార్ధామ్ యాత్రలో కీలకమైన కేదార్నాథ్ ఆలయాన్ని మే 2న ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆలయ కమిటీ అధికారి విజయ్ ప్రసాద్ తెలిపారు. దీంతోపాటు ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయాల్లో ఉన్న గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 30న, బద్రీనాథ్ గుడిని మే 4న తెరవనున్నారు. ఈ నాలుగు ఆలయాలను కలిపి చార్ధామ్గా పిలుస్తారు. మంచు, విపరీతమైన చలి కారణంగా ఈ ఆలయాలను సంవత్సరంలో కొన్ని నెలలే తెరుస్తారు.

ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్లో <<15417347>>ట్రైనీస్<<>> లేఆఫ్స్పై కలగజేసుకోవాలని KA లేబర్ కమిషనర్ను కేంద్ర లేబర్ మినిస్ట్రీ కోరింది. తీసుకున్న చర్యలపై వివరంగా రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. NITES ఫిర్యాదు మేరకు రెండోసారి లేఖ రాసింది. ‘ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోండి. అలాగే మాకూ, ఫిర్యాదుదారులకు సమాచారం ఇవ్వండి’ అని అందులో పేర్కొంది. తాము నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోలేదని కంపెనీ వాదిస్తోంది.

తుపాకి కంటే కలంతో ఎక్కువ మందిని కదిలించొచ్చని తన సాహిత్యంతోనే స్వాతంత్ర్యం కోసం పోరాడారు కవయిత్రి మహాదేవి. UPలో 1907లో జన్మించి.. మహిళలు ఇంటికే పరిమితమవ్వాలన్న నిబంధనలను బద్దలు కొట్టారు. తొమ్మిదేళ్లకే పెళ్లియినప్పటికీ చదువు కోసం భర్తను వదిలి పలు డిగ్రీలు పూర్తిచేశారు. విప్లవ పత్రికలతో పాటు మహిళా హక్కుల కోసం పాటుపడ్డారు. స్వాతంత్ర్య పోరాట రచనలతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేసిన భయమే ఎరుగని మహాదేవి.
Sorry, no posts matched your criteria.