news

News February 27, 2025

భారత్‌కు చెప్పే స్థాయి పాక్‌కు లేదు: క్షితిజ్‌ త్యాగి

image

ఇండియాకు నీతులు చెప్పే స్థాయిలో పాక్ లేదని భారత్ రాయబారి క్షితిజ్ త్యాగి తేల్చిచెప్పారు జమ్మూకశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఐరాస మానవహక్కుల మండలిలో పాక్ మంత్రి అజం నజీర్ తరార్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. మైనారిటీలను చిత్రహింసలు పెడుతూ, తరచుగా మానవహక్కుల ఉల్లంఘన చేసే దేశానికి భారత్‌కు చెప్పే స్థాయి లేదన్నారు. జమ్మూకశ్మీర్, లద్దాక్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే అని నొక్కిచెప్పారు.

News February 27, 2025

ఉద్యోగులకు EPFO వడ్డీరేటు తగ్గింపు షాక్?

image

FY25కి గాను EPFO వడ్డీరేటును తగ్గించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలిసింది. FRI జరిగే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగులో తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ప్రస్తుతం 8.25% ఉన్న వడ్డీరేటును 8కి తగ్గిస్తారని అంచనా. స్టాక్‌మార్కెట్లు డౌన్‌ట్రెండులో ఉండటం, బాండ్‌యీల్డులు తగ్గడం మరోవైపు సెటిల్మెంట్లు పెరగడమే ఇందుకు కారణాలు. ట్రస్టీస్ నిర్ణయం 30 కోట్ల చందాదారులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనుంది.

News February 27, 2025

మహాకుంభమేళా ముగిసినా కొనసాగుతున్న రద్దీ

image

మహాకుంభమేళా ముగిసినా ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివెళ్లారు. దీంతో సంగమం ప్రాంతంలోని పలు సెక్టార్లలో భక్తులు కనిపిస్తున్నారు. నిన్నటితో కుంభమేళా ముగియగా, 45 రోజుల్లో 66.21 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

News February 27, 2025

తగ్గిన బంగారం ధరలు

image

కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు ఈరోజు తగ్గి కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.80,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.87,380కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,06,000గా ఉంది.

News February 27, 2025

ధనుష్-నాగార్జున ‘కుబేర’ రిలీజ్ డేట్ ఖరారు

image

ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కుబేర’ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 20న ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. విధి ఆడే ఆటలో అధికారం, డబ్బు కోసం జరిగే యుద్ధాన్ని ఇందులో చూపించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

News February 27, 2025

కుంభమేళాలో పాల్గొంటే బీజేపీకి దగ్గరయినట్టా?: డీకే

image

తాను బీజేపీకి దగ్గరవుతున్నానని వస్తున్న పుకార్లన్నీ అబద్ధాలేనని కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ స్పష్టం చేశారు. ‘నేను పుట్టుకతోనే కాంగ్రెస్ వాదిని. అయితే నా వ్యక్తిగత నమ్మకాలను నేను అనుసరిస్తాను. హిందువుగా పుట్టాను. హిందువుగానే జీవిస్తాను. హిందువుగానే మరణిస్తాను. కుంభమేళాకు వెళ్లినంత మాత్రాన బీజేపీకి దగ్గరవుతున్నానని చెబుతారా? కుంభమేళాకు యూపీ ప్రభుత్వం మెరుగైన ఏర్పాట్లు చేసింది’ అని తెలిపారు.

News February 27, 2025

ఘోరం: ఆగి ఉన్న బస్సులో యువతిపై అత్యాచారం

image

పుణేలో ఢిల్లీ ‘నిర్భయ’ తరహా ఘటన జరిగింది. ఆగి ఉన్న బస్సులో యువతి(26)పై ఓ మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని దత్తాత్రేయ రాందాస్‌గా గుర్తించారు. పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సతారా జిల్లా ఫల్తాన్‌కు చెందిన యువతి పుణేలోని ఆసుపత్రిలో కౌన్సిలర్‌గా పనిచేస్తోంది. ఊరికి వెళ్లేందుకు స్వర్గేట్ బస్టాండ్‌కు వచ్చింది. బస్సు పక్కన నిలిపి ఉందని ఆమెను తీసుకెళ్లిన నిందితుడు రేప్‌ చేశాడు.

News February 27, 2025

Stock Markets: బ్యాంకు, మెటల్ షేర్ల జోరు

image

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, సెంటిమెంటు నెగటివ్‌గా ఉండటమే ఇందుకు కారణాలు. నిఫ్టీ 22,559 (+11), సెన్సెక్స్ 74,639 (+40) వద్ద కొనసాగుతున్నాయి. INDIA VIX 13.37కు దిగిరావడం అనిశ్చితి తగ్గడాన్ని సూచిస్తోంది. బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ షేర్లకు గిరాకీ ఉంది. ఆటో, మీడియా, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లు సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొంటున్నాయి.

News February 27, 2025

అమానుషం.. పిల్లాడు హోంవర్క్ చేయలేదని..

image

AP: హోంవర్క్ చేయలేదని ఒంగోలు బాలాజీరావుపేటలో 3వ తరగతి బాలుడు దేవాష్‌కు ట్యూషన్ టీచర్ వాతలు పెట్టారు. అవి పుండ్లుగా మారి చిన్నారి అవస్థ పడుతున్నాడు. దీంతో SNపాడు(M)లో సచివాలయ ఉద్యోగిగా పనిచేసే బాలుడి తల్లి గౌతమి టీచర్ సాబిరాకు ఫోన్ చేసి ఘటనపై అడగ్గా వాగ్వాదం జరిగింది. ఆపై టీచర్ భర్త తనకు కాల్ చేసి బెదిరించినట్లు గౌతమి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దేవాష్ తండ్రి విశాఖలో జాబ్ చేస్తుంటారు.

News February 27, 2025

శివరాత్రి జాగరణ.. ఇవాళ ఏం చేయాలంటే?

image

శివరాత్రి సందర్భంగా నిన్న ఉపవాసం ఉండి జాగరణ చేసిన భక్తులు ఇవాళ ఉదయం శివాలయానికి వెళ్లి ప్రసాదం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలని చెబుతున్నారు. నిన్న ఉపవాసం, జాగరణ చేసిన వారంతా ఇవాళ రాత్రి అయ్యే వరకూ నిద్రపోకూదడని, అలా చేస్తేనే పూర్తి ఫలితం దక్కుతుందని అంటున్నారు.