India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: మానవత్వం చూపేదే హిందూ మతమని, మానవత్వం చూపనివాళ్లు తాము హిందువని చెప్పుకోలేరని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ‘తిరుమల గొప్పదనాన్ని, లడ్డూ విశిష్టతను చంద్రబాబే నాశనం చేశారు. నన్ను గుడికి పంపినా, పంపకపోయినా CBN చేసిన పాపం ప్రజల మీద పడకుండా ఉండేందుకు ప్రతి నియోజకవర్గంలో పూజలు నిర్వహించాలి’ అని పిలుపునిచ్చారు.
TG: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ పరిధిలో గోడలపై పోస్టర్లు, పెయింటింగ్స్, వాల్ రైటింగ్స్ వేయడంపై నిషేధం విధించారు. అనుమతులు లేకుండా ఏమైనా చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సినిమా వాళ్లు సైతం అనుమతులతో వాల్ పోస్టర్లు వేయాలన్నారు. ఈ అంశంపై లోకల్ ప్రింటర్స్తో మాట్లాడాలని డిప్యూటీ కమిషనర్లను ఆమె ఆదేశించారు.
ఢిల్లీలో గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు, కాలుష్యాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోనందుకు ఎయిర్ క్వాలిటీ ప్యానెల్పై సుప్రీంకోర్టు మండిపడింది. పంట వ్యర్థాలు కాల్చకుండా CAQM ఎలాంటి కమిటీలను ఏర్పాటు చెయ్యకపోవడాన్ని తప్పుబట్టింది. ‘ఏటా పంట వ్యర్థాల దహనాన్ని చూస్తున్నాం. CAQM చట్టాన్ని పాటించడం లేదు. ఒక్క చర్యనైనా తీసుకున్నట్టు చూపండి? మీరు మౌన ప్రేక్షకులు’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
స్మిత్, రూట్, విలియమ్సన్తో పోలిస్తే విరాట్ వెనుకబడ్డారన్న విమర్శల్ని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ తోసిపుచ్చారు. కోహ్లీకి ఉన్న ఒత్తిడిని మిగిలిన వారెవరూ కనీసం ఊహించలేరని పేర్కొన్నారు. ‘ప్రతి మ్యాచ్లోనూ ప్రదర్శన చేయాలన్న ఒత్తిడి విరాట్పై ఉంటుంది. తను అత్యున్నత ప్రమాణాల్ని సెట్ చేయడంతో 70 రన్స్ చేసినా ఫ్యాన్స్ విఫలమైనట్లే భావిస్తారు. ప్రతీ మ్యాచ్లో సెంచరీ చేయాలని కోరుకుంటారు’ అని వివరించారు.
AP: తన తండ్రి వైఎస్సార్ ఐదేళ్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారని జగన్ గుర్తుచేశారు. ‘ఏడుకొండలవాడి ఆశీస్సులతోనే నా పాదయాత్ర ప్రారంభించా. యాత్ర ముగిశాక కాలినడకన కొండ ఎక్కి స్వామిని దర్శించుకున్నా. అప్పుడు CMగా ఉన్న చంద్రబాబుకు ఈ విషయం తెలియదా? నేను CM హోదాలో ఐదుసార్లు వస్త్రాలు సమర్పించా. 10-11 సార్లు వెళ్లిన తర్వాత ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో అడ్డుకుంటామని నోటీసులు ఇస్తారా?’ అని మండిపడ్డారు.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా సూపర్ స్టార్ రజనీకాంత్కు అభిమాని అనే విషయం మీకు తెలుసా? రోబో 2.0 సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ జరుగుతుండగా సల్మాన్ను ఆహ్వానించనప్పటికీ అక్కడికి చేరుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. వేదికపైకి వచ్చి రజనీకి హగ్ ఇచ్చి బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అని కొనియాడారు. సల్మాన్ ఖాన్ ఓకే అంటే వెంటనే ఆయనతో సినిమా తీస్తా అని సూపర్ స్టార్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తెగ వైరలయ్యాయి.
కాన్పూర్ టెస్టు మ్యాచ్కు హాజరైన బంగ్లాదేశ్ వీరాభిమానిపై ఎలాంటి దాడి జరగలేదని యూపీ పోలీసులు తెలిపారు. డీహైడ్రేషన్ కారణంగా అతను అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. వెంటనే అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు.
AP: నందిని నెయ్యిని YCP హయాంలో కొనుగోలు చేయలేదని, మిగతా కంపెనీల నెయ్యిని తక్కువ ధరకు కొన్నారని చంద్రబాబు చేసిన విమర్శలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. ‘CBN హయాంలో 2015-2018 మధ్య నందిని బ్రాండ్ను ఎందుకు కొనుగోలు చేయలేదు? 2015లో కేజీ నెయ్యి ధర రూ.276, 2019లో రూ.324కు కొన్నారు. మా హయాంలో రూ.320కి కొంటే తప్పేముంది? ఇప్పుడు హెరిటేజ్ ధరలు పెంచుకోవడానికి CBN ప్రయత్నిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
AP: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కోసం ట్యాంకర్లలోని కల్తీ నెయ్యిని వాడలేదని ఈవో చెప్పారని YS జగన్ వెల్లడించారు. ’22న EO నివేదికలో కూడా ట్యాంకర్లను వెనక్కి పంపినట్లు ఉంది. EO చెప్పినా కూడా CM రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నారు. జంతువుల కొవ్వు కలిసిందని అబద్ధాలు ఆడుతూ తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు. జరగనిది జరిగినట్లుగా అబద్ధాన్ని ప్రచారం చేయడం ధర్మమేనా? ఇది అపవిత్రత కాదా?’ అని ప్రశ్నించారు.
All Time Highలో ఉన్న సెన్సెక్స్లో 86,000 వద్ద ఉన్న బలమైన రెసిస్టెన్స్ BSE సూచీని నష్టాలబాట పట్టించింది. ఏ సెషన్లోనూ సూచీ ఈ కీలక దశను దాటలేకపోయింది. Lower Low ఫాం చేసుకుంటూ నష్టాలవైపు సాగింది. అటు నిఫ్టీలో 26,300 వద్ద Call సైడ్ భారీ OI, Change In OI ఉండడంతో బేర్స్ (Call Sellers) తమ బలాన్ని ప్రదర్శించారు. చివరికి సూచీ 26,170 స్థాయిలో సపోర్ట్ తీసుకుంటూ కన్సాలిడేట్ అయ్యింది.
Sorry, no posts matched your criteria.