India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్టాక్మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, సెంటిమెంటు నెగటివ్గా ఉండటమే ఇందుకు కారణాలు. నిఫ్టీ 22,559 (+11), సెన్సెక్స్ 74,639 (+40) వద్ద కొనసాగుతున్నాయి. INDIA VIX 13.37కు దిగిరావడం అనిశ్చితి తగ్గడాన్ని సూచిస్తోంది. బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ షేర్లకు గిరాకీ ఉంది. ఆటో, మీడియా, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లు సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొంటున్నాయి.

AP: హోంవర్క్ చేయలేదని ఒంగోలు బాలాజీరావుపేటలో 3వ తరగతి బాలుడు దేవాష్కు ట్యూషన్ టీచర్ వాతలు పెట్టారు. అవి పుండ్లుగా మారి చిన్నారి అవస్థ పడుతున్నాడు. దీంతో SNపాడు(M)లో సచివాలయ ఉద్యోగిగా పనిచేసే బాలుడి తల్లి గౌతమి టీచర్ సాబిరాకు ఫోన్ చేసి ఘటనపై అడగ్గా వాగ్వాదం జరిగింది. ఆపై టీచర్ భర్త తనకు కాల్ చేసి బెదిరించినట్లు గౌతమి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దేవాష్ తండ్రి విశాఖలో జాబ్ చేస్తుంటారు.

శివరాత్రి సందర్భంగా నిన్న ఉపవాసం ఉండి జాగరణ చేసిన భక్తులు ఇవాళ ఉదయం శివాలయానికి వెళ్లి ప్రసాదం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలని చెబుతున్నారు. నిన్న ఉపవాసం, జాగరణ చేసిన వారంతా ఇవాళ రాత్రి అయ్యే వరకూ నిద్రపోకూదడని, అలా చేస్తేనే పూర్తి ఫలితం దక్కుతుందని అంటున్నారు.

AP: నిన్న హైదరాబాద్ గచ్చిబౌలిలో పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన పోలీసులు.. కడపలోని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అతడిని కాసేపట్లో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె PSకు తీసుకెళ్లనున్నారు. అక్కడ సీఐ విచారణ చేసి, రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబంపై పోసాని అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేశారు.

TGలో రానున్న 5 రోజులు ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. MAR 2 వరకు అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల తర్వాత బయటికి వెళ్లొద్దని సూచించింది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గుండె జబ్బులు, ఆస్తమా, మానసిక వ్యాధిగ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఏమైనా పనులుంటే ఉదయం 11 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత చూసుకోవాలని తెలిపారు. నిత్యం 5 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలని చెప్పారు.

AP: కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పోసాని కృష్ణమురళి అరెస్టును ఖండిస్తూ #WeStandWithPosani అని కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిని అరెస్టు చేశారని, ఇప్పుడు నాయకులను టార్గెట్ చేశారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వైసీపీ నేతలపై కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

TG: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నిన్న ఓటర్లకు పలువురు అభ్యర్థులు డబ్బులు పంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. కొందరు ఓటర్లకు పార్టీలు కూడా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండడంపై నిఘా ఉందన్న ప్రచారంతో నేరుగా ఓటర్ల చేతికే డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తమకు డబ్బులు రాలేవని కొందరు నిరాశ చెందుతుండటం గమనార్హం.

AP: శివుడిని తలచుకున్నా, ఆయన విగ్రహం చూసినా తనకు ఎంతో బలం వస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘బాబు గారి అరెస్ట్ తర్వాత నా ఆలోచన విధానం మారింది. శివుడిపై భక్తి చాలా పెరిగింది. రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలనే నమ్మకం కలిగింది. నా యువగళం పాదయాత్రలో స్వయంగా శివుడే నన్ను నడిపించాడు’ అని వ్యాఖ్యానించారు.

AFG చేతిలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ క్రికెటర్ డకెట్పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల INDపై వరుసగా రెండు వన్డేలు ఓడిపోయాక డకెట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేం 3-0 తేడాతో ఓడినా పెద్ద మ్యాటర్ కాదు. మేం ఇక్కడికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వచ్చాం. ఇండియాను ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడిస్తాం. అప్పుడు ఈ ఓటమిని ఎవరూ గుర్తుంచుకోరు’ అని అన్నారు. కానీ CTలో ఇంగ్లండ్ సెమీస్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది.

పక్క రాష్ట్రాలకు వెళ్లినప్పుడు మనకు అక్కడి భాషల్లోనే నేమ్ బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ, కుంభమేళాలో భాగంగా UPలోని చాలా ప్రాంతాల్లో తెలుగు బోర్డులు దర్శనం ఇచ్చాయి. ప్రయాగ్రాజ్కు వెళ్లే మార్గాల్లో, త్రివేణీ సంగమం వద్ద, కాశీలోనూ UP ప్రభుత్వం తెలుగుభాషలో బోర్డులు ఏర్పాటు చేసింది. దీంతో AP, తెలంగాణ నుంచి వెళ్లిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగు భాషకు దక్కిన గౌరవం అని పలువురు గర్వపడ్డారు.
Sorry, no posts matched your criteria.