India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలోని మన్ననూర్ నుంచి ఏపీలోని శ్రీశైలం వరకు 55 KM మేర అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం, NTCAకు పంపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.7,000 కోట్లు ఖర్చు చేయనుంది. ఇది కార్యరూపం దాలిస్తే దేశంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్గా నిలవనుంది. మన్ననూరు నుంచి దట్టమైన అడవుల అందాలను వీక్షిస్తూ, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ నేరుగా శ్రీశైలం వెళ్లవచ్చు.
టాటాసన్స్, తైవాన్ కంపెనీ PSMC లీడర్షిప్ టీమ్ PM నరేంద్రమోదీని కలిసింది. గుజరాత్ ఢోలేరాలో నెలకొల్పే సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్ FAB అప్డేట్స్ను ఆయనకు తెలియజేసింది. భారత్లో తమ ఫూట్ప్రింట్ పెంచుకొనేందుకు PSMC ఆసక్తి ప్రదర్శించినట్టు మోదీ ట్వీట్ చేశారు. FAB కోసం ఈ 2 కంపెనీలు రూ.91000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ప్రతి నెలా 50వేల వేఫర్స్ ఉత్పత్తి చేసే ఈ కంపెనీ 20వేల జాబ్స్ క్రియేట్ చేయనుంది.
తమ లక్ష్యం నెరవేరే వరకూ హెజ్బొల్లాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఘర్షణ ఆపేందుకు US ప్రతిపాదించిన 21 రోజుల కాల్పుల విరమణను ఆయన తిరస్కరించారు. ఉత్తర ఇజ్రాయెల్ను ఖాళీ చేసిన ప్రజలు తిరిగి వారి స్థానానికి తీసుకొస్తామని చెప్పారు. కాగా సిరియా-లెబనాన్ సరిహద్దులోని బాల్బెక్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్పై జరిపిన దాడిలో 23మంది మరణించారు.
TG: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం NOV 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను అమల్లోకి తేనుంది. రిజిస్ట్రేషన్ శాఖ ప్రకారం ప్రస్తుతం చ.అడుగు ఫ్లాట్ ధర సగటున రూ.3200 ఉంది. ఇది 30శాతం(రూ.960) మించకుండా ఉండేలా సర్కార్ చర్యలు తీసుకుంటోంది. అయితే సాగు భూములు, స్థలాల విషయంలో ఇప్పుడున్న విలువను సవరించి గజం ధర రూ.వెయ్యి ఉంటే దాన్ని రూ.2వేలకు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. 1915 SEP 27న ఆసిఫాబాద్ తాలూకా వాంకిడిలో జన్మించారు. 1952లో MLAగా ఎన్నికయ్యారు. మంత్రిగాను సేవలందించారు. వంశపారంపర్యంగా వస్తున్న వృత్తులు చేసుకుని బతుకుతున్న వారి అభ్యున్నతికి పాటుపడ్డారు. TG రాష్ట్ర డిమాండ్ కోసం ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాల్లో ఆయన పెద్ద దిక్కుగా నిలబడ్డారు. ఆయన జయంతిని రాష్ట్ర ఉత్సవంగా సర్కార్ ప్రకటించింది.
AP: గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. HYDలో నిన్న రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఆయనను విజయవాడ కోర్టులో హాజరుపర్చనున్నారు. గత ప్రభుత్వంలో గనుల శాఖలో టెండర్లు, ఒప్పందాలు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని వెంకటరెడ్డిపై అభియోగాలున్నాయి. గత నెలలో GOVT ఆయనను సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లభించలేదు. ఈ నెల 11న ACB కేసు నమోదు చేసింది.
AP: లడ్డూ కల్తీ వ్యవహారంపై రాజకీయ మంటలు చెలరేగుతున్న వేళ మాజీ CM జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠగా మారింది. ఇవాళ తిరుమల చేరుకోనున్న ఆయన రేపు దర్శనానికి వెళ్తారు. అయితే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ తీసుకున్నట్లుగానే జగన్ నుంచీ తీసుకునేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అతిథిగృహంలో ఆయనకు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వనున్నారని సమాచారం. ఆయన సంతకం పెట్టకపోతే నిబంధనల మేరకు దర్శనానికి అనుమతించబోరని తెలుస్తోంది.
రాష్ట్రం అంటే చాలా జిల్లాలుంటాయి. కానీ దేశంలోనే అతి చిన్న రాష్ట్రమైన గోవాలో కేవలం రెండే జిల్లాలున్నాయి. భారత్కు 1947లోనే స్వాతంత్ర్యం లభించినా, గోవాకు పోర్చుగీసు నుంచి 1961లో ఫ్రీడమ్ దక్కింది. అనంతరం 26 ఏళ్లకి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. పర్యాటకమే ఈ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు. అన్నట్టు.. ఇక్కడ 1962కి ముందు పుట్టిన వారు పోర్చుగీసు పౌరసత్వానికి అర్హులు.
Jr.NTR, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘దేవర’ ప్రీమియర్లు పడ్డాయి. సినిమాలో ఎన్టీఆర్ మాస్ యాక్టింగ్తో అదరగొట్టారని, కొన్ని సీన్లు గూస్బంప్స్ తెప్పిస్తాయని నెట్టింట ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంటర్వెల్ థ్రిల్లింగ్ ట్విస్ట్, అనిరుధ్ BGM అదిరిపోయాయని చెబుతున్నారు. VFX ఇంకా బాగుండాల్సిందని, జాన్వీని పాటలకే పరిమితం చేశారని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ.
ఆదిపురుష్లో ప్రభాస్ శ్రీరాముడి పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన మరోసారి రామాయణంలో నటించనున్నారని బీటౌన్ వర్గాలంటున్నాయి. ‘రామాయణం’ ఆధారంగా బాలీవుడ్లో రణ్బీర్, సాయి పల్లవి జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అందులో పరశురాముడి రోల్లో ప్రభాస్ నటించనున్నారని సమాచారం. ఆ మూవీలో ప్రధాన పాత్రల గురించి పలు ప్రచారాలు నడుస్తుండగా, అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.