news

News September 26, 2024

ఈ నెల 30న విశ్వహిందూ పరిషత్ శాంతియుత నిరసనలు

image

TG: తిరుమల లడ్డూ అపవిత్రమైన ఘటన హిందూ మనోభావాలను గాయపరిచిందని తెలంగాణ విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించి మహా పాపం తలపెట్టారని మండిపడింది. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చింది.

News September 26, 2024

బిహార్‌లో విషాదం.. నీట మునిగి 46 మంది మృతి

image

బిహార్‌లో జివుతియా పండుగ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నదీ స్నానాలు చేసే క్రమంలో మూడు రోజుల వ్యవధిలో 46 మంది మరణించారు. వీరిలో 37 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషాద ఘటనలపై ప్రభుత్వం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని తెలిపింది.

News September 26, 2024

ఉరిశిక్ష ఖైదీ.. 46ఏళ్ల జైలుజీవితం తర్వాత నిర్దోషిగా విడుదల

image

కాల మహిమ అంటే ఇదే! జపాన్‌లో ఓ ఉరిశిక్ష ఖైదీ 46 ఏళ్ల జైలుజీవితం తర్వాత నిర్దోషిగా బయటపడ్డారు. 1968లో తను పనిచేసే ఓనర్ ఫ్యామిలీని హత్యచేశారని ఇవాయో హకమాడను అరెస్టు చేశారు. క్రైమ్‌సీన్ దగ్గర్లోని బావిలో దొరికిన రక్తం అంటిన దుస్తులు అతడివేనని కోర్టు శిక్ష వేసింది. పోలీసుల టార్చర్‌తో చేయని నేరం అంగీకరించానని ఆ తర్వాత చెప్పడంతో మళ్లీ విచారణ కొనసాగింది. ఆ బట్టలపై రక్తం ఆయనది కాదని DNA టెస్టులో తేలింది.

News September 26, 2024

500+ T20లు ఆడింది కేవలం ఆరుగురే

image

కీరన్ పొలార్డ్ – 684, డ్వేన్ బ్రావో – 582 , షోయబ్ మాలిక్ – 542, సునీల్ నరైన్ – 525, ఆండ్రీ రసెల్ – 523, డేవిడ్ మిల్లర్ – 500.
ఈ లిస్టులో మిల్లర్ మినహా అందరూ ఆల్‌రౌండర్లే. పైగా విండీస్ వాళ్లే ఎక్కువ. ప్రపంచంలోని అన్ని లీగుల్లో ఆడటమే ఇందుకు కారణం. IPL, BBL, CPL, SA20, MLC, PSL సహా దేన్నీ వదలరు. సిక్సర్లు దంచుతూ, వికెట్లు తీస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తారు కాబట్టే ఫ్రాంచైజీలు వీరికోసం ఎగబడతాయి.

News September 26, 2024

ఉపఎన్నికలు జరిగితే BRSకు డిపాజిట్ కూడా రాదు: కడియం

image

TG: అవినీతి, అక్రమాలకు BRS మారుపేరు అని MLA కడియం శ్రీహరి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాసిందని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని విమర్శించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని, ఒకవేళ వచ్చినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఉపఎన్నికలు జరిగితే BRSకు డిపాజిట్ కూడా రాదని వ్యాఖ్యానించారు. కోర్టులపై తమకు గౌరవం ఉందన్నారు.

News September 26, 2024

ప్రజలు ఎగిరితంతారని భయపడుతున్నారా?: BJP

image

TG: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ప్రజలతో మంత్రుల ముఖాముఖి’ నిర్వహణ తీరును తెలంగాణ BJP విమర్శించింది. ‘కంచెలు లేని మంచి పాలన తెస్తామని గొంతు చించుకుని అరిచినోళ్లు ఈరోజు ఎవరినీ చెంతకు రానివ్వకుండా కంచెల చాటున దాక్కుని మాట్లాడుతున్నారెందుకో? మీ మోసాన్ని, మీరు పెడుతున్న గోసల్ని చూసి ఎవరు ఎక్కడినుంచి వచ్చి ఎగిరితంతారోనని భయపడుతున్నారా?’ అని ట్వీట్ చేసింది. నేటి ముఖాముఖిలో మంత్రి దామోదర పాల్గొన్నారు.

News September 26, 2024

యూట్యూబర్ హర్షసాయిపై మరో ఫిర్యాదు

image

TG: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయిపై బాధితురాలు మరో ఫిర్యాదు చేశారు. హర్షసాయి తనకు ఈ-మెయిళ్లు పంపిస్తూ వేధిస్తున్నాడని హైదరాబాద్ నార్సింగి పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటికే తనపై అత్యాచారం చేశాడని, రూ.2 కోట్ల డబ్బులు కూడా తీసుకున్నాడని హర్షపై ఇదే పీఎస్‌లో ఆమె కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

News September 26, 2024

కేటీఆర్‌పై మండిపడ్డ మంత్రి సీతక్క

image

TG: అమృత్ టెండర్లలో అక్రమాలు జరిగాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మండిపడ్డారు. అమృత్ అనేది కేంద్ర పథకమని చెప్పారు. తప్పులు జరిగితే కేంద్రమే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సీఎం బంధువుగా ఆరోపిస్తున్న సృజన్ రెడ్డి MLC కవితతో కలిసి లిక్కర్ వ్యాపారం చేశారన్నారు. ఆయనపై లిక్కర్ కేసులో ఆరోపణలున్నాయన్నారు. మరోవైపు హైడ్రాను కూడా కావాలనే విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.

News September 26, 2024

GET READY: 6.03కి ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని సెకండ్ సింగిల్‌పై ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు అప్డేట్ రానుంది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్విటర్‌లో తెలియజేశారు. దీనికి డైరెక్టర్ శంకర్ సైతం ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు రిప్లై ఇవ్వడంతో అప్డేట్‌పై మరింత ఆసక్తి నెలకొంది. కాగా, సెకండ్ సింగిల్ ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ ప్రోమో ఈనెల 28న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

News September 26, 2024

MUDA SCAM: నేనెందుకు రిజైన్ చేయాలంటున్న సిద్దరామయ్య

image

ముడా స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్దరామయ్య CM పదవికి రిజైన్ చేయనని తెగేసి చెప్పారు. BJP నేతల విమర్శలపై ఇలా స్పందించారు. ‘అసలు నేనెందుకు రిజైన్ చేయాలి? HD కుమార‌స్వామి పైనా ఆరోపణలు ఉన్నాయి. మరి ఆయన రిజైన్ చేశారా? మోదీతో ఆయన్ను రిజైన్ చేయించమనండి’ అని ఎదురు ప్రశ్నించారు. ఇదంతా పొలిటికల్ డ్రామా అని, బీజేపీ నేతలు, కేంద్రమంత్రుల్లో చాలా మందిపై కేసులున్నాయని డిప్యూటీ CM శివకుమార్ ఆరోపించారు.

error: Content is protected !!