India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అత్యంత శక్తిమంతమైన సౌర తుఫాన్ ఈ నెల 24న భూమిని తాకింది. గత 6 ఏళ్లలో భూమిని తాకిన అతి బలమైన భూ అయస్కాంత తుఫాన్ ఇదేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. దీని కారణంగా విద్యుత్ గ్రిడ్లు, నావిగేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్లలో చిన్న చిన్న అంతరాయాలు కలిగాయని NOAA స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ తెలిపింది.

కాంగ్రెస్ పార్టీ సమైక్యత కోసం సోనియా, రాహుల్ గాంధీ PM పీఠాన్ని త్యాగం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. 2004లో కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన సోనియా.. మన్మోహన్ను ప్రధానిని చేశారని గుర్తు చేశారు. అప్పుడు MPలు, UPA కూటమిలోని పార్టీలన్నీ సోనియానే PM కావాలని కోరుకున్నాయని వెల్లడించారు. కానీ, ఓ ఆర్థికవేత్త కోసం ఆమె ప్రధాని పీఠం త్యాగం చేశారని అన్నారు.

ఫ్లోరిడా ప్రభుత్వం కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ దేశంలో 14ఏళ్ల లోపు వారు సోషల్ మీడియా వాడటాన్ని నిషేధించింది. ఈమేరకు ఆ దేశ చట్ట సభలో ఆమోదించిన బిల్లుకు ఫ్లోరిడా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా.. ఇది పిల్లల వాక్ స్వాతంత్ర్యం, తల్లిదండ్రుల హక్కులను హరించే చర్య అని కొందరు విశ్లేషకులు అంటున్నారు.

బ్రెజిల్లో నెల్లూరు జాతి ఆవు రికార్డు సృష్టించింది. వయాటినా-19 ఎఫ్ఐవీ మారా ఇమోవీస్ అనే ఆవు రూ.40 కోట్లకు అమ్ముడై ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. అత్యంత నాణ్యమైన జన్యులక్షణాలు గల నెల్లూరు జాతి ఆవును సొంతం చేసుకునేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం, అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఈనగలగడం ఈ జాతి ఆవుల ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.

★ న్యూయార్క్- 119 మంది
★ లండన్- 97
★ ముంబై- 92
★ బీజింగ్- 91
★ షాంఘై- 87
★ షెన్జెన్- 84
★ హాంకాంగ్- 65
★ మాస్కో- 59
★ ఢిల్లీ- 57 ★ శాన్ ఫ్రాన్సిస్కో- 42

CSK: రుతురాజ్(C), రచిన్ రవీంద్ర, రహానే, మిచెల్, శివమ్ దూబే, జడేజా, రిజ్వీ, ధోనీ, దీపక్ చాహర్, తుషార్, ముస్తాఫిజుర్ రెహమాన్. (IMP: రషీద్, శాంట్నర్, పతిరణ, నిశాంత్ సింధు, శార్దూల్)
GT: సాహా, గిల్(C), అజ్మతుల్లా ఒమర్జాయ్, మిల్లర్, విజయ్ శంకర్, తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్. (IMP: సాయి సుదర్శన్, అభినవ్ మనోహర్, నూర్ అహ్మద్, మానవ్ సుతార్, శరత్)

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉంటున్న BRS ఎమ్మెల్సీ కవితకు కొన్ని సౌకర్యాలు కల్పించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇంటి భోజనం, మంచం, పరుపులు, చెప్పులు, దుస్తులు, పుస్తకాలు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. పెన్ను, పేపర్లు, నగదు, మందులు తీసుకెళ్లేందుకు అంగీకరించింది. కాగా ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.

ఢిల్లీలో ఓ ఫొటో జర్నలిస్టుపై ఒక పోలీస్ అధికారి అనుచితంగా ప్రవర్తించారు. సీఎం కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఆ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న ఓ ఫొటో జర్నలిస్టును ఒక పోలీస్ అధికారి గొంతు పట్టుకొని వెనక్కి నెట్టారు. దీనికి సంబంధించిన ఫొటో జర్నలిస్టు వర్గాల్లో వైరల్ అవుతోంది.

కోవిడ్ సోకి తగ్గినా వారి మెదడుపై ఆ వైరస్ ప్రభావం చూపిస్తున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా SARS-CoV-2 బాధితుల్లో IQ పవర్, జ్ఞాపకశక్తి తగ్గిపోవడంతో పాటు వారి మెదడు కూడా ఏడేళ్ల వృద్ధాప్యం పొందినట్లు ఇంగ్లండ్ సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తేలింది. వారి మెదడు సైజు, ఆకారంలోనూ మార్పులు వస్తున్నాయన్నారు. బాధితుల మానసిక ఆరోగ్యంపై ‘కోవిడ్’ ఎప్పటికి ‘చెరగని గుర్తు’గా వాళ్లు అభివర్ణిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల డీఏ పెంచగా.. ఎరియర్స్ జమ కావడంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త డీఏ కలపడంతో పెరిగిన జీతాలు, HRA, రెండు నెలల ఎరియర్స్ మార్చి 30వ తేదీన జమ కానున్నట్లు సమాచారం. కాగా 4శాతం డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డీఏ 50శాతానికి పెరిగింది. దీని ద్వారా 48.67 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
Sorry, no posts matched your criteria.