Telangana

News May 29, 2024

 ఉప్పల్‌లో టీ20 మ్యాచ్‌.. మెదక్ విజయం

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ మైదానంలో బుధవారం జరిగిన T20 ఫైనల్ మ్యాచ్‌లో మెదక్ జట్టు ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న మెదక్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే సాధించింది. 23 పరుగుల తేడాతో మెదక్ జట్టు ఫైనల్‌లో విజయం సాధించి కప్పును సొంతం చేసుకుంది.

News May 29, 2024

ఉప్పల్‌ స్టేడియంలో టీ20 మ్యాచ్‌.. కరీంనగర్ ఓటమి

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ మైదానంలో బుధవారం మెదక్‌ జట్టుతో జరిగిన టీ-20 ఫైనల్ మ్యాచ్‌లో కరీంనగర్ జట్టు ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న మెదక్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 రన్స్ మాత్రమే చేసింది. దీంతో 23 పరుగుల తేడాతో మెదక్ జట్టు ఫైనల్‌లో విజయం సాధించి కప్పును సొంతం చేసుకుంది.

News May 29, 2024

అంగన్వాడీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ 

image

తిమ్మాపూర్ మండలం LMD కాలనీలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో సీడీపీవోలు, ఏసీడీపీవోలు, సూపర్వైజర్లు, ఎంపిక చేసిన అంగన్వాడీ టీచర్లు, పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. బాధ్యాతయుతంగా విధులు నిర్వర్తించాలని, చిన్నారుల యోగా క్షేమాలు తెలుసుకోవాలన్నారు.

News May 29, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలివే…

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా నవబ్ పేటలో 39.9 డిగ్రీలు నమోదైంది. గద్వాల జిల్లా అలంపూర్‌లో 39.1, నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో 38.8, వనపర్తి జిల్లా దగడలో 38.6, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో 38.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 29, 2024

HYD: పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారి నుంచి పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డుల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు HYD జిల్లా యువజన, క్రీడా అధికారి ఎస్.సుధాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31వ తేదీ సా.5 గంటల్లోగా జిల్లా యువజన, క్రీడా అధికారి కార్యాలయం, 8-303, థర్డ్ ఫ్లోర్, స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్ కలెక్టరేట్ కాంప్లెక్స్ లక్డీకాపూల్, హైదరాబాద్‌ అడ్రస్‌లో 4 సెట్ల దరఖాస్తులను సమర్పించాలన్నారు.

News May 29, 2024

HYD: పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారి నుంచి పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డుల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు HYD జిల్లా యువజన, క్రీడా అధికారి ఎస్.సుధాకర్  రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31వ తేదీ సా.5 గంటల్లోగా జిల్లా యువజన, క్రీడా అధికారి కార్యాలయం, 8-303, థర్డ్ ఫ్లోర్, స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్ కలెక్టరేట్ కాంప్లెక్స్ లక్డీకాపూల్, హైదరాబాద్‌ అడ్రస్‌లో 4 సెట్ల దరఖాస్తులను సమర్పించాలన్నారు. 

News May 29, 2024

KMR: కలకలం రేపిన అస్థిపంజరం.. ఎవరిదో..?

image

కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం షేర్ ఖాన్ పల్లి గ్రామ శివారులో బుధవారం వెలుగు చూసిన ఓ మానవ అస్థిపంజరం కలకలం రేపింది. సమాచారం అందుకున్న బాన్సువాడ పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో దర్యాప్తు చేపట్టి, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇది ఎవరిది? ఈ అస్థిపంజరం ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పడి ఉంది? తదితరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

News May 29, 2024

MBNR: బీసీ గురుకులాల్లో చేరేందుకు ఈనెల 30 LAST DATE

image

ఉమ్మడి జిల్లాలోని 25 బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులు ఈనెల 30లోగా వారికి కేటాయించిన పాఠశాలల్లో చేరాలని బీసీ గురుకులాల సమస్వయకర్త వెంకట్ రెడ్డి తెలిపారు. MJP బీసీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు పాఠశాలలు కేటాయించారు. కావున ఎంపికైన వారు తమ ధ్రువ పత్రాలతో ఈనెల 30లోగా కేటాయించిన పాఠశాలలో చేరాలని కోరారు.
SHARE IT

News May 29, 2024

కల్హేరు: కుమార్తెను చూసేందుకు వచ్చి తండ్రి మృతి

image

కుమార్తెను చూసేందుకు వచ్చిన తండ్రి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కల్హేర్ ASI అంజయ్య తెలిపారు. అంస్సాన్‌‌పల్లికి చెందిన శ్రీధర్‌కు 2 ఏళ్ల క్రితం నాగధర్ గ్రామానికి చెందిన సావిత్రితో వివాహమైంది. వీరికి ఇటీవలే కూతురు పుట్టింది. రెండు రోజుల క్రితం శ్రీధర్ తన కూతుర్ని చూడడానికి భార్య పుట్టింటికి రాగా ఛాతి నొప్పితో ఇంట్లో కుప్పకూలి మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు.

News May 29, 2024

సూర్యాపేట: ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి

image

హుజూర్‌నగర్ మండలం గోపాలపురం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.