India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అకాల వర్షాలు, అనుకోకుండా వచ్చే ఈదురు గాలులు ఉమ్మడి జిల్లాలో విషాదం నింపుతున్నాయి. పది రోజులుగా ఈదురు గాలులతో కురుస్తున్న భారీ వర్షాల్లో పిడుగులు పడి రైతులు, రైతు కూలీలతో పాటు ఎన్నో మూగజీవాలు మృతి చెంది అనేక కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శిథిలావస్థకు చేరిన ఇండ్లను నేలమట్టం చేసి, పిడుగులు ఈదురుగాలులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
కరీంనగర్ జిల్లా ముగ్దుంపూర్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం బస్వాపురం గ్రామానికి చెందిన పి.నాని(19) హైదరాబాద్లోని TVS సంస్థలో సర్వీస్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. పని నిమిత్తం బైక్పై పెద్దపల్లికి వెళ్లి తిరిగి కరీంనగర్కు వస్తుండగా ముగ్దుంపూర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందాడు.
లవ్ ఫెయిల్ అయి ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన ZHBలో జరిగింది. ఆనెగుంటకు చెందిన వెంకట్(30) HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఇన్స్టాగ్రామ్లో NZB జిల్లా బాల్కొండకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కాగా వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. కొద్దిరోజులకు ఆమె కూడా పెళ్లికి నో చెప్పడంతో మనస్తాపం చెంది పట్టణ శివారులో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.
లవ్ ఫెయిల్ అయి ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన ZHBలో జరిగింది. ఆనెగుంటకు చెందిన వెంకట్(30) HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఇన్స్టాగ్రామ్లో NZB జిల్లా బాల్కొండకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కాగా వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. కొద్దిరోజులకు ఆమె కూడా పెళ్లికి నో చెప్పడంతో మనస్తాపం చెంది పట్టణ శివారులో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.
పాముకాటుతో యువకుడు మృతిచెందిన ఘటన తిరుమలగిరి (సాగర్) మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జువ్విచెట్టు తండాకు చెందిన సపావత్ శంకర్ HYDలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ పట్టభద్రుల ఉపఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడానికి స్వగ్రామం వచ్చారు. ఇంటి బయట వరండాలో నిద్రిస్తుండగా పాముకాటు వేసింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని దండు గ్రామం సమీపంలోని అంతర్రాష్ట్ర రహదారి-167పై మహబూబ్ నగర్ నుంచి రాయచూర్ వెళ్తున్న కర్ణాటక <<13331578>>బస్సు, బైక్<<>> ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెంకటేష్(29), రాఘవేంద్రచారి(30) అక్కడికక్కడే మృతి చెందగా.. మహేష్(21) కాలు విరిగి తలకు తీవ్రగాయాలు కావడంతో 108లో మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో MBNRకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.
గ్రూప్-2, సింగరేణి ఉద్యోగాలిప్పిస్తామని రూ.4కోట్ల వరకు వసూలు చేసి మోసగించిన ముఠాను చుంచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రవీణ్కమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా రంగశాయిపేటకు చెందిన దాసు హరికిషన్ చుంచుపల్లి మండల పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాలిప్పానని నమ్మించి డబ్బులు వసూలు చేశారు. ఈ స్కామ్లో హరికిషన్తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
HYDలో వ్యభిచార గృహాలపై పోలీసులు రైడ్స్ చేశారు. గుడిమల్కాపూర్లో స్పా & మసాజ్ సెంటర్ ముసుగులో ప్రాస్టిట్యూషన్ జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేశారు. స్పా సెంటర్ ఓనర్పై కేసు నమోదైంది. ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. 8 మంది అమ్మాయిలను రెస్క్యూ చేసినట్లు CI తెలిపారు. నాగోల్ PS పరిధిలోనూ మంగళవారం రైడ్స్ చేసిన పోలీసులు నిర్వాహకురాలితో పాటు మరో విటుడిని అదుపులోకి తీసుకొన్నామన్నారు.
HYDలో వ్యభిచార గృహాలపై పోలీసులు రైడ్స్ చేశారు. గుడిమల్కాపూర్లో స్పా & మసాజ్ సెంటర్ ముసుగులో ప్రాస్టిట్యూషన్ జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేశారు. స్పా సెంటర్ ఓనర్పై కేసు నమోదైంది. ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. 8 మంది అమ్మాయిలను రెస్క్యూ చేసినట్లు CI తెలిపారు. నాగోల్ PS పరిధిలోనూ మంగళవారం రైడ్స్ చేసిన పోలీసులు నిర్వాహకురాలితో పాటు మరో విటుడిని అదుపులోకి తీసుకొన్నామన్నారు.
నల్గొండ జిల్లా పెద్దఅడిశర్ల పల్లి మండలం నీలంనగర్లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ- అంబులెన్స్ ఢీ కొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ- అంబులెన్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.