India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వడదెబ్బ తాళలేక మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. ఎవరైనా తప్పిపోయి ఉంటే నర్సాపూర్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30% పోలింగ్ నమోదయింది. ఎమ్మెల్సీ పరిధిలోని 12 జిల్లాలలో పోలింగ్ శాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట-33.19, జనగాం-28.38, హన్మకొండ-32.90, వరంగల్-31.05, మహబూబాబాద్-28. 49, ములుగు-31.99, భూపాలపల్లి-27.69, భద్రాద్రి-25.79, ఖమ్మం-30.18, యాదాద్రి భువనగిరి-27.71, సూర్యపేట-31.27, నల్గొండ-26.94.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30% పోలింగ్ నమోదయింది. ఎమ్మెల్సీ పరిధిలోని 12 జిల్లాలలో పోలింగ్ శాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట-33.19, జనగాం-28.38, హన్మకొండ-32.90, వరంగల్-31.05, మహబూబాబాద్-28. 49, ములుగు-31.99, భూపాలపల్లి-27.69, భద్రాద్రి-25.79, ఖమ్మం-30.18, యాదాద్రి భువనగిరి-27.71, సూర్యపేట-31.27, నల్గొండ-26.94.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30% పోలింగ్ నమోదయింది. ఎమ్మెల్సీ పరిధిలోని 12 జిల్లాలలో పోలింగ్ శాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి.
సిద్దిపేట-33.19, జనగాం-28.38, హన్మకొండ-32.90, వరంగల్-31.05, మహబూబాబాద్-28. 49, ములుగు-31.99, భూపాలపల్లి-27.69, భద్రాద్రి-25.79, ఖమ్మం-30.18, యాదాద్రి భువనగిరి-27.71, సూర్యపేట-31.27, నల్గొండ-26.94.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మొత్తం 605 కూలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.
వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భారీగా పోలింగ్ నమోదు అవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 30.06 శాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 4 గంటల వరకు భారీగా పోలింగ్ నమోదు అయ్యే అవకాశం కన్పిస్తుంది. ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద పట్టభద్రులు ఓటు వేసేందుకు భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.
నేడు ఖమ్మం జిల్లాలో జరుగుతున్న శాసన మండలి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉదయం 10 గంటల వరకు 13. 01 శాతం పోలింగ్ నమోదయినట్లు సంబంధిత ఎన్నికల అధికారులు తెలియజేశారు. కాగా, జిల్లాలో ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావు లేకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి.
రెండు రోజుల సాధారణ సెలవుల అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభం కావడంతో పత్తి తరలివచ్చింది. అయితే గతవారంతో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా తగ్గింది. నేడు క్వింటా పత్తి ధర రూ.7,200 పలికింది. పత్తి ధర మళ్లీ తగ్గడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. కాగా, మార్కెట్లో క్రయ విక్రయాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
వరంగల్ జిల్లాలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికలో ఉదయం 10:00 గంటల వరకు పోలింగ్ 13.19% అయింది. ఓటర్లు తమ ఓటును సకాలంలో వినియోగించుకోవాలని అధికారులకు కోరుతున్నారు. ఇప్పటివరకు 13 శాతం ఓటింగ్ పోల్ కావడంతో రాజకీయ పార్టీ నాయకులు ఓటర్లకు ఫోన్ చేసి ఓటు వేసేందుకు మోటివేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని అధికారులు కూడా చెబుతున్నారు.
నార్కెట్పల్లి మండల కేంద్రంలోని డోకూరు ఫంక్షన్ హాల్లో ఓ పార్టీ నేతలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ ఆందోళనకు దిగారు. ఇదేంటని ప్రశ్నిస్తే తనపై దాడి చేసి, మొబైల్ ధ్వంసం చేశారని PS ముందు భైఠాయించారు. అధికార పార్టీ నాయకులే ఈ పని చేశారని అశోక్ ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.