India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లాలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికలో ఉదయం 10:00 గంటల వరకు పోలింగ్ 13.19% అయింది. ఓటర్లు తమ ఓటును సకాలంలో వినియోగించుకోవాలని అధికారులకు కోరుతున్నారు. ఇప్పటివరకు 13 శాతం ఓటింగ్ పోల్ కావడంతో రాజకీయ పార్టీ నాయకులు ఓటర్లకు ఫోన్ చేసి ఓటు వేసేందుకు మోటివేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని అధికారులు కూడా చెబుతున్నారు.
నార్కెట్పల్లి మండల కేంద్రంలోని డోకూరు ఫంక్షన్ హాల్లో ఓ పార్టీ నేతలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ ఆందోళనకు దిగారు. ఇదేంటని ప్రశ్నిస్తే తనపై దాడి చేసి, మొబైల్ ధ్వంసం చేశారని PS ముందు భైఠాయించారు. అధికార పార్టీ నాయకులే ఈ పని చేశారని అశోక్ ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బాలికపై అత్యాచారం చేసిన ఓ వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆర్మూర్లోని రాజారాంనగర్లో జరిగింది. గ్రామానికి చెందిన ఓ బాలికి తల్లిదండ్రులు శనివారం బాలిక(12)ను ఇంటి వద్ద వదిలి పనికి వెళ్లారు. ఇదే అదును భావించిన ఆ వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడగా బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
విధి చిన్నచూపు చూసి ముగ్గురు చిన్నారులను అనాథులుగా మిగిల్చిన విషాద ఘటనిది. ASF(జి) కౌటాల(మం) పార్డికి చెందిన దివాకర్(36)కు, దహేగాంకు చెందిన భారతితో 2010లో పెళ్లైంది. వీరికి అజిత్, విజయ్ సంతానం. అనారోగ్యంతో 2013లో భారతి చనిపోగా.. దివాకర్ మరో పెళ్లి చేసుకున్నాడు. 2 నెలల కింద మగ శిశువుకు జన్మనిచ్చిన రెండో భార్య 5రోజులకే కన్నుమూసింది. ఈనెల 25న దివాకర్ సైతం అనారోగ్యంతో చనిపోగా పిల్లలు అనాథలయ్యారు.
సమాచారం ఇవ్వకుండానే తరుగు పేరుతో కోతలు విధిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీర్పూర్ మండలంలోని తుంగూర్ కొనుగోలు కేంద్రంలో సేకరించిన ధాన్యాన్ని మిల్లుకు తరలించారు. నాణ్యత లేదంటూ మిల్లర్లు మూడు రోజుల పాటు ధాన్యం తీసుకోకుండా నిలిపివేశారు. విషయాన్ని రైతులకు ముందు సమాచారం ఇవ్వాల్సిన నిర్వాహకులు సంచికి 3కిలోల కోత విధించారని తెలిపారు. ఈవిషయంలో రైతులకు, నిర్వాహకులకు వాగ్వాదం చోటుచేసుకుంది.
గల్ఫ్ దేశానికి వెళ్లిన తనను ఓ ముఠా మోసం చేసిందంటూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. జగిత్యాలకు చెందిన రాజేశ్(39) 6నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఓ ముఠా జాబ్ ఇప్పిస్తానని చెప్పి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించింది. ఇండియాకు వెళ్లిరావాలని వారు చెప్పడంతో స్వదేశానికి బయల్దేరగా అబుదాబి ఎయిర్పోర్టులో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. తన ప్రమేయం లేకుండా లోన్లు తీశారని, ప్రభుత్వం కాపాడాలని బాధితుడు కోరారు.
☞ పోలింగ్ అధికారి ఇచ్చే పెన్నుతో బ్యాలెట్ పేపర్లో1,2,3,4 ఇలా ప్రాధాన్యత క్రమంలో వేయాలి
☞మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం తప్పక వేయాలి
☞ఒక్కరికి/కొందరికి/అందరికీ ఓటు వేయవచ్చు
☞ఆరుగురికి ఓటు వేయాలనుకుంటే.. మొదటి ప్రాధాన్యత ఓటు వేసే అభ్యర్థి ఫోటో ఎదురుగా ఉండే బాక్స్లో 1 నంబర్ వేయాలి. మిగితా అభ్యర్థులకు 2,3,4,5,6 నంబర్లు రాయాలి
☞1,2,3 నంబర్లు వేసి, 4 వేయకుండా 5వ నంబర్ వేస్తే ఆ ఓటు చెల్లదు
రామాయంపేట BRS ప్రెసిడెంట్పై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. పట్టణానికి చెందిన గణేశ్ ఎకరం భూమి డెవలప్మెంట్ కోసం నాగరాజుతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. శనివారం పెద్దమ్మ ఆలయం వద్ద కూర్చుకున్నారు. ఈ టైంలో గణేశ్ నాగరాజుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించే ప్రయత్నం చేశాడు. కేసు నమోదైంది.
KMM-WGL-NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేడు జరగనుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న యాదాద్రి జిల్లా తుర్కపల్లి మం. మాదాపురం ZPHSలో, BJP అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి HNKలోని సుబేదారి, హంటర్రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో, BRS అభ్యర్థి రాకేష్రెడ్డి HNKలోని వడ్డేపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు.
విషం తాగి ఓ అధ్యాపకురాలు బలవన్మరణానికి పాల్పడింది. KPHB పోలీసుల వివరాల ప్రకారం.. MBNR కిషన్నగర్కు చెందిన ఉమాదేవి మియాపూర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తుంది. KPHB సర్దార్ పటేల్ నగర్ సమీపంలోని ఓ ప్రైవేట్ వసతి గృహంలో ఉంటుంది. ఈ నెల 24న విషరసాయనం ఆన్లైన్లో ఆర్డర్ చేసి తాగేసింది. గమనించిన వసతి గృహం నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
Sorry, no posts matched your criteria.