India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గాలివాన బీభత్సానికి నాగర్కర్నూల్ జిల్లాలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. తిమ్మాజీపేట మం. మారెపల్లికి చెందిన వెంకటయ్య (54) పిడుగుపాటుతో మృతిచెందాడు. నాగర్కర్నూల్ సమీపంలోని మంతటి వద్ధ కారులో కుర్చున్న వ్యక్తికి కారు అద్దాలు గుచ్చుకుని చనిపోయాడు. రేకుల షెడ్డు ఇటుక పెళ్ల ఎగిరి పడటంతో కారు అద్దం పగిలింది. అలాగే తాడూరు మండలంలో గోడకూలి నలుగురు, తెలకపల్లిలో పిడుగుపాటుతో బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లాడ మండలం నారాయణపురానికి చెందిన మాజీ ఎంపీపీ రాములు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రాములు తన ఇంట్లో మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
NGKL జిల్లాలో ఈదురుగాలులతో కూడిన గాలివాన ఓ యువకుడి ప్రాణం తీసింది. కారులో కుర్చున్న వ్యక్తికి కారు అద్దాలు గుచ్చుకుని చనిపోయాడు. స్థానికుల కథనం.. వేణుగోపాల్(35) కారు డ్రైవర్. యాత్రికులను తీసుకొని శ్రీశైలం వెళ్లి తిరుగు వస్తున్నారు. ఈ క్రమంలో NGKL సమీపంలో మంతటి వద్ద రేకుల షెడ్డు ఇటుక పెళ్ల ఎగిరి కారుపై పడింది. దీంతో కారు అద్దం పగిలి గుచ్చుకొని వేణు అక్కడికక్కడే మృతి చెందాడు.
పాలమూరులో ZPTC, MPTC సభ్యుల పదవీ కాలం జూలై 3తో ముగియనుంది. 2019 జూలై 4న మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరాయి. తిరిగి జూలై 4న కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కావాల్సి ఉంది. దీంతో ఈ ఏడాదంతా సర్పంచ్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో వరుసగా ఎన్నికల పండగ కొనసాగనుంది. ఆయా ఎన్నికల్లో తమ ప్రాబల్యాన్ని చూపేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలతో మమేకం అయ్యేందుకు సిద్దమవుతున్నారు.
ఈదురుగాలులతో పానగల్ చెరువులో ఒకరు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం.. చందనపల్లికి చెందిన కొందరు చేపలు పట్టడానికి చెరువులోకి వెళ్లారు. ఈ క్రమంలో ఈదురుగాలులు వీయడంతో చెరువులో గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు ఈత కొట్టుకుంటు పానగల్ కట్టవైపు వెళ్లి బయటపడగా.. కోడదల సైదులు చెరువులో గల్లంతయ్యారు. చీకటి వల్ల గాలించే పరిస్థితి లేకపోవడంతో సైదులు కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని 44 నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సత్య పీర్ల దర్గా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అతను మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బాలిక కిడ్నాప్ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 24న నడికుడ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన బాలిక కిడ్నాప్ అయ్యింది. ఈ కేసులో బండి దీక్షిత్, కుమారస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం చిన్నారిని బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
రేపు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నిబంధనల మేరకు ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ గౌతం సూచించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రోమన్ అంకె లేదా సాధారణ అంకెల రూపంలోనే ఓటు వేయాలన్నారు. అలాకాకుండా ప్రాధాన్యత క్రమాన్నిమార్చివేస్తే ఆ ఓటు చెల్లుబాటు కాదన్నారు. ఓటు వేసే ముందు అక్కడ సిబ్బందిని ఏదైనా అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు.
అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 28 నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. మంగళవారం నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు జిల్లా కేంద్రంలోని సైన్స్ డిగ్రీ కళాశాలలో ఉంటాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన హల్టికెట్లు ఈ https://www.braouonline.in/ వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయని సకాలంలో పరీక్షకు హాజరు కావాలని సూచించారు.
గాలి వాన బీభత్సానికి నాగర్కర్నూల్ జిల్లాలో ఏడుగురు చనిపోయారు. బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో పిడుగుపాటుతో గోపాల్ రెడ్డి(45) చనిపోగా నాగర్కర్నూల్ సమీపంలోని మంతటి వద్ధ కారులో కుర్చున్న వ్యక్తికి కారు అద్దాలు గుచ్చుకుని చనిపోయాడు. రేకుల షెడ్డు ఇటుక పెళ్ల ఎగిరి పడటంతో కారు అద్దం పగిలింది. అలాగే తాడూరు మండలంలో గోడకూలి నలుగురు, తెలకపల్లిలో పిడుపాటుతో బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.