Telangana

News May 26, 2024

నిప్పుల కొలిమిలా నిర్మల్..రాష్ట్రంలోనే అత్యధికం

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొట్టడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఆదివారం రాష్ట్రంలోని అత్యధికంగా నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో రికార్డు స్థాయిలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే నిర్మల్‌లోని ముజిగిలో 45.2, నిర్మల్ జిల్లా కడెంలో 44.6, నిర్మల్ జిల్లా తానుర్‌లో 44.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని చాప్రలలో  44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 26, 2024

VMWD: లంకె బిందెల ఆశ చూపి రూ.30 లక్షలు దోచారు!

image

ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని చెప్పి ఓమహిళ నుంచి రూ.30లక్షలు కాజేసిన ముగ్గురు నిందితులను శనివారం VMWD పోలీసులు అరెస్ట్ చేశారు.CI వీరప్రసాద్ వివరాల ప్రకారం.. హన్మక్కపల్లికి చెందిన అంజవ్వకు ఎల్లయ్య, మహిపాల్, అబ్రహం అనే ముగ్గురు వ్యక్తులు అంజవ్వ తల్లి గారి ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని వాటిని తీయడానికి డబ్బు ఖర్చు అవుతుందని ఆమె నుంచి రూ.30 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో సీఐ కేసు నమోదు చేశారు.

News May 26, 2024

NZB జిల్లా ఆసుపత్రిలో కుళ్లిన భోజనం.!

image

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో వైద్యం కోసం వస్తున్న పేద ప్రజలకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని పలువురు ఆరోపించారు. రోగులకు, వారి కోసం వచ్చిన వారికి అందించే భోజనంలో పురుగులు ఉన్నట్లు, గుడ్లు పాడయిపోయాయని వాపోయారు. ప్రభుత్వాసుపత్రిలో భోజన ఏజెన్సీ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ రోగుల పట్ల శ్రద్ధ వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

News May 26, 2024

మహబూబాబాద్: సమ్మర్‌ హాలిడేస్‌లో విషాదం

image

2 రోజుల క్రితం రహమత్‌నగర్‌లో బిల్డింగ్‌ మీద హైటెన్షన్ వైర్లు తగిలి తీవ్రగాయాల పాలైన లౌలి(8) చికిత్స పొందుతూ కాసేపటి క్రితం HYDగాంధీ ఆస్పత్రిలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 90శాతం శరీరం కాలిపోవడంతో కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. సమ్మర్ హాలిడేస్‌లో మహబూబాబాద్ నుంచి HYDలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన లౌలి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News May 26, 2024

గద్వాల: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

ట్రాక్టర్‌ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రాజోలి పంచాయతీ పరిధి తుమ్మలపల్లి గ్రామ శివారులో జరిగింది. APలోని కర్నూలు జిల్లా గుంతలపాడుకు చెందిన చంద్రశేఖర్(30) బైక్ పై టీ. గార్లపాడు మీదుగా వెళ్తుండగా ట్రాక్టర్ ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. దీంతో యువకుడికి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

News May 26, 2024

HYD: సమ్మర్‌ హాలిడేస్‌లో విషాదం

image

2 రోజుల క్రితం రహమత్‌నగర్‌లో బిల్డింగ్‌ మీద హైటెన్షన్ వైర్లు తగిలి తీవ్రగాయాల పాలైన లౌలి (8) చికిత్స పొందుతూ కాసేపటి క్రితం గాంధీ ఆసుపత్రిలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 90 శాతం శరీరం కాలిపోవడంతో కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. సమ్మర్ హాలిడేస్‌లో మహబూబాబాద్ నుంచి HYDలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన లౌలి మృతి చెందడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.

News May 26, 2024

HYD: సమ్మర్‌ హాలిడేస్‌లో విషాదం

image

2 రోజుల క్రితం రహమత్‌నగర్‌లో బిల్డింగ్‌ మీద హైటెన్షన్ వైర్లు తగిలి తీవ్రగాయాల పాలైన లౌలి (8) చికిత్స పొందుతూ కాసేపటి క్రితం గాంధీ ఆసుపత్రిలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 90 శాతం శరీరం కాలిపోవడంతో కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. సమ్మర్ హాలిడేస్‌లో మహబూబాబాద్ నుంచి HYDలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన లౌలి మృతి చెందడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.

News May 26, 2024

అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు బాధ్యతలు ఇలా..

image

ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసింది. కమిటీల బాధ్యతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
* ప్రాథమిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం
* తాగునీటి సౌకర్యాలు కల్పించడం
* పాఠశాల ప్రాంగణంలో పారిశుధ్యం&నిర్వహణ
* విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టడం
* బాలికల మరుగుదొడ్ల నిర్మాణం
* పాఠశాలలో సోలార్ ఫ్యానల్స్ ఏర్పాటు

News May 26, 2024

MBNR: BRS, BJP మినహా..!!

image

రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. BRS, BJP మినహా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన అన్ని రాజకీయ పార్టీలను, ముఖ్య నేతలను ప్రభుత్వం ఆహ్వానిస్తుందని తెలిపారు.

News May 26, 2024

MBNR: పారదర్శకంగా ఓట్ల లెక్కింపునకు శిక్షణ

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇస్తున్నారు. రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో ఏడు చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.‌ NGKL ఎంపీ సీటు ఓట్ల లెక్కింపు నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో, MBNR ఎంపీ సీటు ఓట్ల లెక్కింపు పాలమూరు యూనివర్సిటీలో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.