Telangana

News May 26, 2024

రోగి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన గాంధీ డాక్టర్!

image

సర్జరీ చేసేందుకు గాంధీ ఆస్పత్రి డాక్టర్ పేషెంట్ నుంచి డబ్బు డిమాండ్ చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటరెడ్డి అనారోగ్యంతో గాంధీలో చేరాడు. సర్జరీ చేయడానికి ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్ వైద్యాధికారి రూ.10 వేలు డిమాండ్ చేశారని, దాంతో తాము Gpay ద్వారా చెల్లించినట్లు పేషెంట్ భార్య గోవిందమ్మ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురు HODలతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

News May 26, 2024

రోగి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన గాంధీ డాక్టర్!

image

సర్జరీ చేసేందుకు గాంధీ ఆస్పత్రి డాక్టర్ పేషెంట్ నుంచి డబ్బు డిమాండ్ చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటరెడ్డి అనారోగ్యంతో గాంధీలో చేరాడు. సర్జరీ చేయడానికి ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్ వైద్యాధికారి రూ.10 వేలు డిమాండ్ చేశారని, దాంతో తాము Gpay ద్వారా చెల్లించినట్లు పేషెంట్ భార్య గోవిందమ్మ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురు HODలతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

News May 26, 2024

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి ఉష్ణోగ్రత వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా మల్లాపూర్‌లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేటలో 39.8, నారాయణపేట జిల్లా ఉట్నూరులో 39.7, నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో 38.4, వనపర్తి జిల్లా దగడలో 37.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 26, 2024

ఆదిలాబాద్: ఈ ఏడాది తగ్గిన రిజిస్ట్రేషన్‌లు..!

image

ఆదిలాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్లు గతేడాదితో పోల్చితే ఈ ఏడాది భారీగా తగ్గాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అంతగా లేకపోవడంతో భూములు, ప్లాట్లు, ఇళ్ల క్రయ విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగలేదని తెలుస్తోంది. జిల్లాలోని ఆదిలాబాద్‌, బోథ్‌ రెండు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 1,342 రిజిస్ట్రేషన్లు తగ్గాయి. దీంతో ఆ శాఖకు సుమారు రూ.7.3కోట్ల ఆదాయం తగ్గింది.

News May 26, 2024

KNR: ఈ నెల 28 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్

image

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28 నుంచి జూన్ 6 వరకు నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జగిత్యాల రోడ్డులోని కరీంనగర్ వివేకానంద రెసిడెన్షియల్ పాఠశాలలో జరుగుతాయని తెలిపారు.

News May 26, 2024

వరంగల్: REWIND.. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచాడు..!

image

2021లో KMM-NLG-WGL పట్టభద్రుల MLC ఎన్నికలో రెండో ప్రాధాన్య ఓట్లతోనే అప్పటి BRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. మొత్తం 5,05,565 ఓట్లకు గానూ 3,87,960 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 21,636ఓట్లు చెల్లలేదు. ఫలితంగా రెండో ప్రాధాన్యతా ఓట్లను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 రోజులపాటు జరిగిన లెక్కింపు అనంతరం అధికారులు విజేతను ప్రకటించారు. రేపు ఈస్థానంలో ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.

News May 26, 2024

నల్గొండ: REWIND.. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచాడు..!

image

2021లో KMM-NLG-WGL పట్టభద్రుల MLC ఎన్నికలో రెండో ప్రాధాన్య ఓట్లతోనే అప్పటి BRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. మొత్తం 5,05,565 ఓట్లకు గానూ 3,87,960 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 21,636ఓట్లు చెల్లలేదు. ఫలితంగా రెండో ప్రాధాన్యతా ఓట్లను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 రోజులపాటు జరిగిన లెక్కింపు అనంతరం అధికారులు విజేతను ప్రకటించారు. రేపు ఈస్థానంలో ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.

News May 26, 2024

ఖమ్మం: REWIND.. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచాడు..!

image

2021లో KMM-NLG-WGL పట్టభద్రుల MLC ఎన్నికలో రెండో ప్రాధాన్య ఓట్లతోనే అప్పటి BRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. మొత్తం 5,05,565 ఓట్లకు గానూ 3,87,960 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 21,636ఓట్లు చెల్లలేదు. ఫలితంగా రెండో ప్రాధాన్యతా ఓట్లను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 రోజులపాటు జరిగిన లెక్కింపు అనంతరం అధికారులు విజేతను ప్రకటించారు. రేపు ఈస్థానంలో ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.

News May 26, 2024

ముచ్చింతల్: సమతా మూర్తిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం

image

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శనివారం శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ శివారులోని సమతా మూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 108 దివ్య ఆలయాలు, స్వర్ణ రామానుజులను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి విశేషాలు గురించి వారికి సవివరంగా వివరించారు.

News May 26, 2024

UPDATE.. HYD: చైన్ స్నాచర్లను ధైర్యంగా ఎదుర్కొన్న తల్లీకూతుళ్లు

image

పహాడీ షరీఫ్ PSలో దుండగులు మూడున్నర తులాల బంగారు చైన్‌ను లాక్కెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కల్పనతో పాటు ఆమె కూతురు లక్ష్మీ ప్రసన్నపై కూడా కర్రతో దాడి చేశారు. ఈ సమయంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన కల్పన ఆగంతకులతో తలపడి వారి బైక్ తాళాలు లాక్కుంది. గాయపడ్డ తళ్లీకూతుళ్లు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. నిందితుల బైక్ నకిలీదని పోలీసులు గుర్తించారు. సీసీ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.