News March 31, 2024
అవ్వాతాతలపై కసి తీర్చుకున్న చంద్రబాబు: వైసీపీ

AP: వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయడంపై EC <<12956311>>ఆంక్షలు<<>> విధించడానికి చంద్రబాబే కారణమని వైసీపీ Xలో విమర్శించింది. ‘అవ్వాతాతలపై CBN కసి తీర్చుకున్నారు. వారికి ఒకటో తేదీన పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారు. పేదల నోటి దగ్గర కూడు తీసేసే కుట్రకు పాల్పడ్డారు. నాడు ఇంగ్లిష్ మీడియం విద్యను, ఇప్పుడు నిమ్మగడ్డతో కలిసి వాలంటీర్ల సేవలను అడ్డుకున్నారు. దీనికి త్వరలోనే TDP మూల్యం చెల్లించుకుంటుంది’ అని ఫైరయ్యింది.
Similar News
News February 17, 2026
బంగ్లా ప్రధానిగా తారిఖ్ ప్రమాణం.. భేటీ అయిన ఓం బిర్లా

బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా BNP చీఫ్ తారిఖ్ రెహ్మాన్ ఢాకాలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భారత్ నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు తారిఖ్తో బిర్లా ప్రత్యేకంగా సమావేశమై భారత్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 297 సీట్లకు గాను ఆ పార్టీ 209 చోట్ల గెలిచిన విషయం తెలిసిందే.
News February 17, 2026
రూ.10 కోట్లు చెల్లించాల్సిందే.. విశాల్కు కోర్టు ఆదేశం

ప్రముఖ హీరో విశాల్కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లైకా ప్రొడక్షన్స్కు వెంటనే రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఇందుకు ఆరు వారాల సమయం కావాలంటూ హీరో మరో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టేసింది. గడువు ఇచ్చేందుకు నిరాకరించింది. కాగా సినిమా తీస్తానని విశాల్ తమ వద్ద రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేదంటూ లైకా 2022లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
News February 17, 2026
దారుణం.. రైలులో యువతిపై TTE అత్యాచారం

అహ్మదాబాద్-గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్లో దారుణం జరిగింది. NCC క్యాడెట్ పరీక్ష రాసి వెళ్తున్న యువతిపై TTE రాహుల్ అత్యాచారం చేశాడు. రద్దీ ఎక్కువ ఉండటంతో ఆమె టికెట్ తీసుకోకుండా ఏసీ కోచ్ ఎక్కింది. సీటు ఇప్పిస్తానని చెప్పి TTE క్యాబిన్కు తీసుకెళ్లి రేప్ చేశాడు. ఆ తర్వాత బాధితురాలు 112కు ఫోన్ చేయడంతో నిందితుడు డియోరియా స్టేషన్లో దిగి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.


