News April 2, 2024
రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

AP: రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ‘ఎన్నికలకు ముందు పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. పింఛన్ల పంపిణీని సీఎం జగన్ సరిగా నిర్వర్తించటం లేదు. దీంతో రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పెన్షన్ అందించాలి. ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News February 19, 2026
చిన్న వయసులోనే తల నెరుస్తోందా?

చర్మంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు తెల్లవెంట్రుకలు కనిపిస్తాయి. ఇది వృద్ధాప్యచిహ్నం. కానీ ప్రస్తుతం చాలామందికి చిన్నవయసులోనే తల నెరుస్తోంది. హార్మోనుల్లో అసమతుల్యత, అనారోగ్యకర జీవన శైలి, కాలుష్యం, రసాయనాలున్న, సింథటిక్ షాంపూలు వాడటం దీనికి కారణం అంటున్నారు నిపుణులు. గోధుమ, పెరుగు, టొమాటో, అరటి, చిరుధాన్యాలు, గుడ్డు, చేప, సీఫుడ్, సోయాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
News February 19, 2026
TG EAPCET దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే EAPCET దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 4 వరకు <
News February 19, 2026
రేపు యశ్ ‘టాక్సిక్’ టీజర్

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ‘టాక్సిక్’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. రేపు ఉదయం 9.35 గంటలకు టీజర్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ కీలక పాత్రలో నటించారు. ఈ పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 19న విడుదలవనుంది.


