News April 11, 2024
జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్లో మార్పులు

జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్లో మార్పులు చేసినట్లు ఐఐటీ మద్రాస్ ప్రకటించింది. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన వారు ఏప్రిల్ 27 నుంచి మే 7న సా.5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. మే 10 వరకు ఫీజు చెల్లించవచ్చని, మే 17 నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. మే 26న పరీక్షను యథాతథంగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
Similar News
News December 13, 2025
నెలలో జరీబు భూముల సమస్యల పరిష్కారం: పెమ్మసాని

AP: అమరావతిలో జరీబు భూముల సమస్యల పరిష్కారానికి నెల సమయం కోరామని కేంద్ర మంత్రి P.చంద్రశేఖర్ తెలిపారు. సాయిల్ టెస్ట్ అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘రాజధాని గ్రామాల్లో శ్మశానాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలను త్వరలోనే కల్పిస్తాం. ల్యాండ్ పూలింగ్లో ఇప్పటికీ 2,400 ఎకరాలను కొందరు రైతులు ఇవ్వలేదు. వారితో మరోసారి చర్చిస్తాం. భూసమీకరణ కుదరకపోతే భూసేకరణ చేస్తాం’ అని పేర్కొన్నారు.
News December 13, 2025
పుష్ప-2 రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’

రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. రెండో శుక్రవారం ₹34.70 కోట్ల కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో హిందీ పుష్ప-2(₹27.50Cr) రికార్డును బద్దలు కొట్టింది. ఆ తర్వాతి స్థానాల్లో ఛావా(₹24.30Cr), యానిమల్(₹23.53Cr), గదర్-2(₹20.50Cr), హిందీ బాహుబలి-2(₹19.75Cr) ఉన్నాయి. ఓవరాల్గా ధురంధర్ మూవీ ₹300+Cr <<18544001>>కలెక్షన్లు<<>> సాధించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది.
News December 13, 2025
రూ.3600 కోట్లతో హరియాణా క్లీన్ ఎయిర్ ప్లాన్!

గాలి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించేందుకు హరియాణా ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్తో MoU కుదుర్చుకుంది. రూ.3,600 కోట్లతో ‘హరియాణా క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్’ను ప్రారంభించింది. ఐదేళ్లలో ఢిల్లీ-ఎన్సీఆర్లో (National Capital Region) గాలి నాణ్యత మెరుగుపరచడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. 500 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, 50,000 ఈ-ఆటోలకు ప్రోత్సాహకాలు అందించడం వంటివి ప్రతిపాదనలో ఉన్నాయి.


