News April 20, 2024

తేలిపోయిన చెన్నై బౌలర్లు.. ఫ్యాన్స్ అసంతృప్తి

image

IPL: లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు తేలిపోయారు. రెండు వికెట్లు తీసేందుకే బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. ముఖ్యంగా తుషార్ దేశ్‌పాండే ప్రదర్శనపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 19వ ఓవర్‌లో రెండు వైడ్లు, ఓ నోబాల్ వేయడమే ఇందుకు కారణం. 18వ ఓవర్ ముగిసే సమయానికి లక్నో 12 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి ఉంది. కానీ తుషార్ చెత్త ప్రదర్శన వల్ల లక్నోకు మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయం వరించింది.

Similar News

News December 17, 2025

ఇక టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్ చూడొచ్చు

image

ఇకపై ఫోన్లలో ఇన్​స్టా రీల్స్ చూస్తూ కళ్లు పాడుచేసుకునే భారం తగ్గిపోనుంది. Insta టీవీ యాప్‌ను విడుదల చేసింది. దీంతో పెద్ద స్క్రీన్‌పై రీల్స్, షార్ట్ వీడియోలను వీక్షించవచ్చు. ముందుగా USలోని సెలక్టెడ్ అమెజాన్ ఫైర్ టీవీ ప్లాట్‌ఫార్మ్స్‌పై దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. భవిష్యత్తులో ఇతర టీవీ ప్లాట్‌ఫార్మ్స్‌కు విస్తరించనున్నారు. TVలోనూ SM వినియోగం పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

News December 17, 2025

గాజాకు బలగాలు?.. సంకటంలో పాకిస్థాన్!

image

గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్‌కు సైనికులను అందించాలని పాకిస్థాన్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. అయితే దీనికి ఒప్పుకోలేక, కాదనలేక పాక్ సంకటంలో ఉంది. సైనికులను పంపిస్తే సొంత దేశంలోనే నిరసనలు ఎదురయ్యే అవకాశం ఉంది. US, ఇజ్రాయెల్‌ను పాక్ ఇస్లామిక్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సైనికులను పంపకపోతే ట్రంప్ ఆగ్రహానికి గురికాక తప్పదు. దీంతో ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది పాక్ పరిస్థితి.

News December 17, 2025

ఓటు వేసి వెళ్తూ గుండెపోటుతో మృతి

image

TG: తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ఓటు వేసి ఇంటికి వెళ్తుండగా నాగులవంచ సత్యనారాయణ(65) గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియనుంది.