News March 14, 2025

ఏప్రిల్ 9 నుంచి 1-9వ తరగతి ఎగ్జామ్స్

image

TG: రాష్ట్రంలో 1-9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు (సమ్మేటివ్ అసెస్‌మెంట్-2) ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 17న పరీక్షలు ముగుస్తాయని, అనంతరం జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి అదే నెల 23న ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులు అందించాలని ఆదేశించింది.

Similar News

News February 17, 2026

జనగామ.. ‘లక్కీ డ్రా’మా

image

TG: అనూహ్య పరిణామాల మధ్య జనగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ముగిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు సమాన ఓట్లు రావడంతో అధికారులు లక్కీ డ్రా తీశారు. ఇందులో కాంగ్రెస్‌నే అదృష్టం వరించింది. ఆ పార్టీకి చెందిన బాలమణి ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. దీంతో BRS సభ్యులు నిరసనకు దిగారు. వైస్ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకున్నారు. మరోవైపు తొర్రూరు మున్సిపాలిటీలోనూ లక్కీ డ్రా తీయగా కాంగ్రెస్‌కే ఛైర్మన్(శ్రవణ్) పదవి దక్కింది.

News February 17, 2026

ESIC కాన్పూర్‌లో జూనియర్ ఇంజినీర్ పోస్టులు

image

<>ESIC<<>> కాన్పూర్‌ 4 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ/డిప్లొమా( సివిల్, ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.33,630 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in

News February 17, 2026

ప్రపంచంలోనే ధనిక గ్రామం.. ఎక్కడుందంటే?

image

గుజరాత్‌లోని మాదాపర్ సుమారు ₹7,000 కోట్ల బ్యాంక్ డిపాజిట్లతో ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ 17కు పైగా బ్యాంక్ శాఖలు ఉండటం విశేషం. ఇక్కడి కుటుంబీకులు విదేశాల్లో స్థిరపడినా తమ సంపాదనను సొంత ఊరి బ్యాంకుల్లోనే పొదుపు చేస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు. వీరి పొదుపు మంత్రం, పుట్టిన ఊరిపై ఉన్న మమకారం ప్రతి గ్రామానికి ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.