News April 3, 2024
ఉమ్మడి చిత్తూరులో నేడు సీఎం జగన్ బస్సు యాత్ర

AP: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 7వ రోజు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం 9గంటలకు అమ్మగారిపల్లె నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. తేనెపల్లి, రంగంపేట క్రాస్ మీదుగా మధ్యాహ్నానికి జగన్ పూతలపట్టు చేరుకుంటారు. మ.3గంటలకు పూతలపట్టులో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం పి.కొత్తకోట, పాకాల, గదంకి, పనపాకం, చంద్రగిరి, రేణిగుంట మీదుగా గురువరాజుపల్లె చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
Similar News
News February 18, 2026
ఎLAW: చిల్లుపై బిల్లుతో పోరాడవచ్చు

హోటళ్లలో ఫుడ్ తిన్నాక అస్వస్థతకు గురైతే ఆ మేనేజ్మెంట్ను తిట్టుకుని, డాక్టర్ను కలిసి మెడిసిన్ వేసుకుని సరిపెట్టుకుంటాం. కానీ మనకు జరిగిన శారీరక, ఆర్థిక, మానసిక నష్టానికి పరిహారం పొంది చట్టపర చర్యలతో మరోసారి, మరొకరికి ఇలా జరగకుండా చూడొచ్చు. దీనికి కావాల్సింది మీ ఫుడ్ బిల్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్. వీటితో ఫుడ్ సేఫ్టీ అథారిటీలో లేదా కోర్టులో కేసు వేయొచ్చు. కాబట్టి డబ్బు చెల్లించగానే బిల్ పడేయకండి.
News February 18, 2026
ఆత్మ గౌరవం కోసం మార్గదర్శకాలు

– నీ మాటలకు విలువ లేని చోట మౌనంగా ఉండటమే శ్రేయస్కరం.
– నిన్ను గౌరవించని ప్రదేశంలో ఒక్క క్షణం కూడా నిలబడకూడదు.
– ప్రేమ లేని చోట దాని కోసం ఆశ పడటం వ్యర్థం.
– నీకు నచ్చని, నువ్వు తప్పు చేయని విషయాలకు అనవసరంగా క్షమాపణలు చెప్పకు.
– నీకు నచ్చని పనుల గురించి ఇతరులకు వివరణలు ఇస్తూ కూర్చోకు.
News February 18, 2026
నెలకు రూ.82,720 జీతంతో ఉద్యోగాలు

కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్(<


