News August 3, 2024
అమెరికాకు సీఎం రేవంత్.. రేపటి నుంచి పర్యటన షురూ

TG: సీఎం రేవంత్ ఆగస్టు 4-13 వరకు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ఐటీ, హెల్త్ కేర్/లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, తదితర రంగాలకు సంబంధించి రూ.16వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం సీఎం, కొందరు అధికారులు బయలుదేరగా రేపు మంత్రి శ్రీధర్బాబు వెళ్లనున్నారు.
Similar News
News December 15, 2025
తీవ్ర పొగమంచు.. మోదీ టూర్పై ఎఫెక్ట్

తీవ్ర పొగమంచు ప్రభావం ప్రధాని మోదీ విదేశీ పర్యటనపై పడింది. ఢిల్లీ ఎయిర్పోర్టును పొగమంచు దట్టంగా కమ్మేయడంతో ఆయన ప్రయాణం ఆలస్యమైంది. ఇవాళ ఉదయం 8.30 గంటలకే ఆయన బయల్దేరాల్సి ఉంది. ఈ నెల 18 వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. కాగా ఉత్తర భారతంలో పొగమంచు వల్ల పలు రోడ్డు <<18561671>>ప్రమాదాలు<<>> చోటుచేసుకుంటున్నాయి. విమాన సర్వీసులపైనా తీవ్ర ప్రభావం పడింది.
News December 15, 2025
బంధాలకు భయపడుతున్నారా?

గామోఫోబియా అనేది రిలేషన్షిప్కు సంబంధించిన భయం. ఏదైనా బంధంలోకి వెళ్లడానికి, కమిట్మెంట్కు వీరు భయపడతారు. ఇదొక మానసిక సమస్య. ఈ ఫోబియా ఉన్నవాళ్లు ఒంటరిగా బతకడానికే ఇష్టపడతారు. దీన్నుంచి బయటపడటానికి మానసిక వైద్యుడిని సంప్రదించాలి. కౌన్సెలింగ్ తీసుకోవాలి. కుటుంబసభ్యులతో గడపాలి. పెళ్లికి సంబంధించి పాజిటివ్ విషయాలను తెలుసుకోవాలి. ఈ సమస్య నుంచి బయటపడి సరైన బంధంలోకి వెళ్లి జీవితాన్ని ఆస్వాదించండి.
News December 15, 2025
కోటి సంతకాల పత్రాలతో నేడు వైసీపీ ర్యాలీలు

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు వైసీపీ తెలిపింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టనుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలను పార్టీ శ్రేణులు ర్యాలీలో ప్రదర్శించనున్నాయి. వాటిని ఈ నెల 18న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు వైసీపీ అధినేత జగన్ అందజేయనున్నారు. కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దని కోరనున్నారు.


