News April 13, 2024

కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ: కిషన్ రెడ్డి

image

TG: కాంగ్రెస్ అంటే వెన్నుపోటు పార్టీ అని BJP రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘గత పదేళ్లలో KCR కుటుంబం రూ.వేల కోట్లు దోచుకుంది. అందుకే వారిని ప్రజలు ఇంటికి పంపారు. కానీ కాంగ్రెస్ వచ్చాక ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది. రుణమాఫీ చేయలేదు. రైతుబంధు వేయలేదు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News December 15, 2025

లెజెండరీ సింగర్ బయోపిక్‌లో సాయిపల్లవి

image

లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. టైటిల్ రోల్‌లో హీరోయిన్ సాయిపల్లవిని తీసుకునే యోచనలో ఉన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి. గీతా ఆర్ట్స్ నిర్మాణ సారథ్యంలో గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News December 15, 2025

ఎయిమ్స్ కల్యాణిలో 172 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

పశ్చిమ బెంగాల్‌లోని <>ఎయిమ్స్<<>> కల్యాణిలో 172 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, DNB, DM, MCH, MSc, M.biotech, M.Stat, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకున్నవారికి డిసెంబర్ 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://aiimskalyani.edu.in/

News December 15, 2025

2 రోజులు స్కూళ్లకు సెలవు

image

TG: రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఎల్లుండి జరగనున్నాయి. 4,158 సర్పంచ్, 36,434 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా 394 సర్పంచ్, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటైన స్కూళ్లకు రేపు, ఎల్లుండి సెలవులు ఉండనున్నాయి. అలాగే ఓటు వేసేందుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఉంటుంది.