News April 20, 2024

కేంద్రమంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్

image

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎన్నికల బాండ్ల స్కీమ్‌ని పునరుద్ధరిస్తామన్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని చెప్పిన ఎన్నికల బాండ్లను తిరిగి తెస్తామని ఎలా అంటారని దుయ్యబట్టారు. ఇప్పటికే ‘పే పీఎం స్కామ్’ కింద రూ.4లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న BJPకి ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వరని అన్నారు.

Similar News

News December 6, 2025

‘కింగ్’ కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీ చేస్తారా?

image

విశాఖ వేదికగా IND-SA మధ్య ఇవాళ నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి కోహ్లీపైనే ఉంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన విరాట్‌.. ఈరోజు సెంచరీ చేసి హ్యాట్రిక్‌ సాధిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. విశాఖ పిచ్‌పై కోహ్లీకి అద్భుతమైన రికార్డు (7 మ్యాచ్‌ల్లో 3 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు) ఉంది. చిన్న బౌండరీలు కూడా అనుకూలంగా మారనున్నాయి. అన్నీ కలిసొస్తే మరో సెంచరీ ఖాయం.

News December 6, 2025

ఇంటింటికీ ఫ్రీ వైఫై, టీవీ ఛానల్స్.. బాండ్ రాసిచ్చిన సర్పంచ్ అభ్యర్థి

image

TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఓటర్లను ఆకర్షించేందుకు సర్పంచ్ అభ్యర్థులు స్థాయికి మించిన హామీలు ఇస్తున్నారు. అయితే ఇచ్చిన హామీలపై బాండ్లు రాసిచ్చేవారు అరుదు. ములుగు(D) ఏటూరునాగారంలో BJP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి, ఆమె భర్త చక్రవర్తి ఇంటింటికీ వైఫై, ఐదేళ్లు టీవీ ఛానల్స్ ఫ్రీగా అందిస్తామని బాండ్ రాసిచ్చారు. కోతుల బెడద, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

News December 6, 2025

సరిహద్దులపై ‘డ్రాగన్’ పడగ.. 16 స్థావరాల నిర్మాణం!

image

భారత సరిహద్దుల్లో చైనా కుతంత్రాలు ఆగడం లేదు. టిబెట్‌లో సైనిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తోందని, 16 ఎయిర్‌ఫీల్డ్‌లు, హెలిపోర్ట్‌లను నిర్మించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఈ మేరకు 100కు పైగా శాటిలైట్ ఇమేజె‌స్‌ను విశ్లేషించింది. ఆ స్థావరాలు చాలావరకు 14 వేల అడుగుల ఎత్తులో ఉన్నాయని చెప్పింది. 14,850 అడుగుల పొడవైన రన్ వేలు, 70 కన్నా ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్లు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొంది.