News April 30, 2024
రిజర్వేషన్లపై కాంగ్రెస్ది దుష్ర్పచారం: అమిత్ షా

ఎన్నికల వేళ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్న కాంగ్రెస్.. బీజేపీ నినాదాలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తోందని, దాని వెనుక రాహుల్ ఉన్నారన్నారు. తెలంగాణ, కర్ణాటకలో ఈసారి బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News December 5, 2025
క్రియేటివ్ సిటీగా అమరావతి: చంద్రబాబు

AP: అమరావతిలో నిర్మించే ప్రతి భవనం విలక్షణంగా ఉండాలని, పచ్చదనంతో ప్రస్ఫుటంగా కనిపించేలా ఉండాలని CRDA భేటీలో CM CBN సూచించారు. మౌలిక సదుపాయాల కోసం నాబార్డు ₹7,380 కోట్ల రుణానికి ఆమోదం తెలిపిందని చెప్పారు. నాణ్యతలో రాజీపడకుండా గడువుకన్నా ముందే నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించారు. తెలుగు ఆత్మగౌరవానికి, వైభవానికి ప్రతీకగా నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.
News December 5, 2025
మోదీ-పుతిన్ నవ్వులు.. ఎక్కడో మండుతున్నట్టుంది!

పుతిన్ భారత పర్యటనతో US అధ్యక్షుడు ట్రంప్కు ‘ఎక్కడో మండుతున్నట్టుంది’ అంటూ ఇండియన్ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ట్రంప్ ఫొటోలతో ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మోదీ-పుతిన్ నవ్వులు చూసి ఆయన ఏడుస్తుంటారని పోస్టులు పెడుతున్నారు. టారిఫ్స్ ఇంకా పెంచుతాడేమోనని సెటైర్లు వేస్తున్నారు. రష్యాతో సంబంధాలు పెంచుకున్నామనే అక్కసుతోనే ట్రంప్ మనపై అధిక టారిఫ్స్ విధించిన విషయం తెలిసిందే.
News December 5, 2025
స్క్రబ్ టైఫస్ పట్ల ఆందోళన వద్దు: హెల్త్ కమిషనర్

AP: స్క్రబ్ టైఫస్ జ్వరాల పట్ల ఆందోళన అవసరం లేదని హెల్త్ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. 2023 నుంచి కేసులు నమోదవుతున్నాయని, మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది NOV 30 వరకు 736 స్క్రబ్ టైఫస్ కేసులు రికార్డయినట్టు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. శరీరంపై నల్లమచ్చ కనిపించి జ్వరం, తలనొప్పి వస్తే అలర్ట్ కావాలన్నారు. చిగ్గర్ మైటు అనే పురుగు కుట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పారు.


