News April 21, 2024

కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరవు: మోదీ

image

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ 400 సీట్లు గెలుచుకుందని.. కానీ ఇప్పుడు ఆ పార్టీకి అభ్యర్థులు కరవయ్యారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ‘ఇండియా కూటమి పేరుతో అవకాశవాద కూటమి ఏర్పడింది. ఆ కూటమిలోని పార్టీలే ఒకదానిపై మరొకటి పోటీ పడుతున్నాయి. అడ్డదారిన రాజ్యసభకు వెళ్లేందుకు రాజస్థాన్ అడ్డాగా మారింది. సోనియా, మన్మోహన్, కేసీ వేణుగోపాల్‌లు ఇదే దారిలో రాజ్యసభకు వచ్చారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News December 16, 2025

‘సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష’లో ముఖ్యమైన అంశాలు ఇవే!

image

2047కు ఇన్సూరెన్స్ రంగ అభివృద్ధి టార్గెట్‌గా సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష (ఇన్సూరెన్స్ Laws అమెండ్‌మెంట్ బిల్-2025)ను కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. FDIల పరిమితి 74%-100%కి పెంపు, ఛైర్మన్, MD, CEOలలో ఒకరు ఇండియన్ సిటిజన్, సైబర్, ప్రాపర్టీ రంగాలకు లైసెన్సులు, ఇన్సూరెన్స్, నాన్-ఇన్సూరెన్స్ కంపెనీ మెర్జర్లకు అనుమతి, పాలసీ హోల్డర్ రక్షణకు ప్రత్యేక ఫండ్ వంటి మార్పులు బిల్‌లో పొందుపరిచింది.

News December 16, 2025

నిద్రలేమితో ఆయుష్షు తగ్గే ప్రమాదం

image

తగినంత నిద్ర లేకపోతే ఆయుష్షు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. USకు చెందిన ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ (OHSU) చేసిన ఈ పరిశోధన ప్రకారం రోజుకు కనీసం ఏడు గంటల నిద్ర ఉండాలి. స్మోకింగ్ తర్వాత జీవితకాలాన్ని ఎక్కువగా తగ్గించే అంశం ఇదేనని, తక్కువగా నిద్రపోవడం వలన రోగనిరోధక శక్తి, మెదడు పనితీరు దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరించారు.

News December 16, 2025

ఎట్టకేలకు అమ్ముడైన పృథ్వీ షా

image

యంగ్ బ్యాటర్ పృథ్వీషాకు ఎట్టకేలకు ఊరట దక్కింది. ఐపీఎల్-2026 మినీ వేలం తొలి రౌండ్‌లో షా అమ్ముడుపోలేదు. మరో రౌండ్‌లో బేస్ ప్రైస్ రూ.75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని సొంతం చేసుకుంది. గతంలో ఇతడు ఢిల్లీ తరఫునే ఆడారు. 79 మ్యాచుల్లో 1,892 రన్స్ చేశారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లు జేమీసన్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ, ఆడమ్ మిల్నేను రూ.2.4 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది.