News March 1, 2025
ముదిరిన వివాదం.. 22న కర్ణాటక బంద్

మహారాష్ట్రలో KSRTC సిబ్బందిపై దాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో వివాదం ముదిరింది. దాడులకు నిరసనగా ఈ నెల 22న కన్నడ సంఘాలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నెల 7న ఛలో బెళగావి, 11న అత్తిబెలె సరిహద్దు బంద్, 16న హోస్కెట్ టోల్ బంద్ చేస్తామని ప్రకటించాయి. త్వరలో బెంగళూరులో భారీ ర్యాలీ చేస్తామని తెలిపాయి. మరాఠీలో మాట్లాడలేదనే కారణంతో KSRTC సిబ్బందిపై పలువురు దాడి చేసిన విషయం తెలిసిందే.
Similar News
News March 15, 2025
ఎముకలు దృఢంగా ఉండాలంటే…

మన ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం.. కాల్షియంతో పాటు డీ, కే విటమిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినాల్సి ఉంటుంది. అలాగే మెగ్నీషియం, ఫాస్పరస్ కూడా కొంత మోతాదులో అవసరమే. అంజీర్, సముద్రపు చేపలు, బాదంపప్పులో ఇవన్నీ లభిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో ఉపకరిస్తాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.
News March 15, 2025
సూపర్ ప్లాన్: ఈ రీఛార్జ్తో 365 రోజులు..

తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్గా ఉండాలనుకునే యూజర్ల కోసం BSNL మంచి ప్లాన్ అందిస్తోంది. రూ.1,198తో రీఛార్జ్ (రోజుకు రూ.3.28) చేస్తే 365 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి నెలా 300 నిమిషాల వరకు ఏ నెట్వర్క్కైనా ఉచిత కాలింగ్, 30 ఫ్రీ SMSలతో పాటు నెలకు 3GB డేటా వస్తుంది. దేశమంతటా రోమింగ్ సమయంలో ఉచిత ఇన్కమింగ్ కాల్స్ పొందొచ్చు. BSNLను సెకండ్ సిమ్గా ఉపయోగించేవారికి ఇది బెస్ట్ ప్లాన్.
News March 15, 2025
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నాం: మంత్రి ఉత్తమ్

TG: ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి (RLIP) కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇది తమ సర్కారు సాధించిన విజయమని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి RLIP నిర్మాణం చేపట్టిందని కేంద్రం వద్ద తాను వాదనలు వినిపించానని చెప్పారు. దీన్ని అడ్డుకోకుండా ఉండి ఉంటే కృష్ణా పరివాహకంలో దుర్భర పరిస్థితి ఏర్పడేదన్నారు.