News April 1, 2024
CSK ఓటమి.. సాక్షి పోస్ట్ వైరల్

నిన్నటి వైజాగ్ మ్యాచులో CSK ఓటమిపై ధోనీ భార్య సాక్షి సింగ్ ఆసక్తికర పోస్ట్ చేశారు. విజయాల ఖాతా తెరిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ను ప్రశంసించారు. మరోవైపు పరోక్షంగా ధోనీ ఇన్నింగ్స్ను కొనియాడుతూనే.. CSK మ్యాచ్ ఓడిపోయిందని గుర్తించలేదని టీజ్ చేశారు. నిన్నటి మ్యాచులో ధోనీ ఆఖర్లో వచ్చి 37 పరుగులు చేశారు.
Similar News
News February 12, 2026
ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు

AP: గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డులుగా మార్చింది. ఇటీవల మంత్రివర్గం తెలిపిన ఆమోదం మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన విషయం తెలిసిందే.
News February 12, 2026
చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
News February 12, 2026
రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

TG: రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రేషన్ కార్డులు లేని అర్హులైన వ్యక్తులు ‘మీ సేవ’ కేంద్రాల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. అలాగే పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చవచ్చని తెలిపింది. గత ఏడాది కాలంలో 14.40 లక్షల కొత్త కార్డులు మంజూరయ్యాయని వెల్లడించింది. కాగా 2026 JANకి మొత్తం కార్డుల సంఖ్య 1,04,35,848కు చేరాయంది.


