News April 20, 2024
కాషాయ రంగులో డీడీ న్యూస్.. ప్రతిపక్షాల విమర్శలు

డీడీ న్యూస్ లోగో కలర్ మారడం వివాదాస్పదమైంది. గతంలో రూబీ రెడ్ రంగులో ఉన్న లోగో ఇటీవల కాషాయ రంగులోకి మారింది. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. లోగో లుక్ మెరుగుపర్చేందుకే రంగు మార్చామని డీడీ న్యూస్ ఇచ్చిన వివరణను తోసిపుచ్చుతున్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందే రంగు మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాయి. ప్రసార భారతి ప్రచార భారతిగా మారిందని TMC ఎంపీ జవహార్ సిర్కార్ విమర్శించారు.
Similar News
News December 17, 2025
ధోనీకి ఇదే చివరి IPL: ఊతప్ప

రానున్న IPL సీజనే ధోనీకి చివరిదని CSK మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప అన్నారు. ఆపై ఎడిషన్లో ఆడతారని తాను అనుకోవట్లేదని చెప్పారు. ప్రస్తుతం జట్టు కూర్పు చూస్తే అదే అర్థమవుతోందన్నారు. ‘గతేడాది, తాజాగా జరిగిన మినీ వేలంలోనూ యంగ్ క్రికెటర్లపై CSK ఎక్కువగా ఖర్చు చేసింది. అలాగే రుతురాజ్, శాంసన్ వంటి సారథులు జట్టులో ఉన్నారు. ఈ క్రమంలో ధోనీ టీం నుంచి తప్పుకొని మెంటార్గా కొనసాగే అవకాశాలున్నాయి’ అని చెప్పారు.
News December 17, 2025
నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

AP: రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో బుధవారం 10AMకు 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించుకొని లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేలా 2 రోజుల కాన్ఫరెన్స్ జరగనుంది. తొలి రోజు 18నెలల పాలనపై సమీక్ష చేసుకొని కలెక్టర్లకు CM దిశానిర్దేశం చేయనున్నారు. 2వ రోజు జిల్లాల్లో ఉత్తమ పద్ధతులు అవలంభించిన కలెక్టర్ల ప్రజెంటేషన్లు, తదితర ప్రోగ్రాంలు ఉండనున్నాయి.
News December 17, 2025
పృథ్వీ షా SAD పోస్ట్.. అంతలోనే!

IPL మినీ వేలంలో తొలిసారి పృథ్వీ షా పేరు రాగానే కొనడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. దీంతో ఆయన it’s ok అని హార్ట్ బ్రేక్ సింబల్ను ఇన్స్టా స్టోరీగా పెట్టారు. కాసేపటికే 2వ రౌండ్లో DC రూ.75 లక్షలకు కొనుగోలు చేయగా దాన్ని డిలీట్ చేసి ‘BACK TO MY FAMILY’ అని పోస్ట్ చేశారు. గతంలో 7 సీజన్లు DCకి ఆడిన షా 79 మ్యాచుల్లో 1,892 రన్స్ చేశారు. 2025 మెగా వేలం ముందు DC ఆయన్ను వదులుకోగా ఏ జట్టూ కొనలేదు.


