News December 7, 2025
DEC9న ‘విజయ్ దివస్’ నిర్వహణ: KTR

TG: KCR ఆమరణ దీక్ష వల్ల 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షకు ఒక రూపం వచ్చిందని BRS నేత KTR పేర్కొన్నారు. ‘11 రోజుల దీక్ష ఫలించి DEC9న ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చింది. KCR త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ఆరోజును విజయ దివస్గా సంబరాలు జరుపుకోవాలి’ అని పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్సులో పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలున్నందున గ్రామాల్లో కాకుండా నియోజకవర్గాల్లో జరపాలన్నారు. ఏ కార్యక్రమాలు చేపట్టాలో ఆయన వివరించారు.
Similar News
News January 13, 2026
సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగురవేస్తారు?

సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేయడం శ్రీరామచంద్రుడి కాలం నుంచి కొనసాగుతోంది. పురాణాల ప్రకారం రాముడు సంక్రాంతి రోజున గాలిపటం ఎగురవేయగా అది ఇంద్రలోకానికి చేరినట్టు చెప్తారు. అప్పటి నుంచి ఇది ఆచారంగా కొనసాగుతోంది. ఇక చైనాలో సైనిక అవసరాల కోసం వీటిని రూపొందించారు. అమెరికా, ఫ్రాన్స్, జపాన్, థాయ్లాండ్ వంటి దేశాలలో వేడుకలుగా జరుపుకుంటారు. దీని వలన శరీరానికి, కళ్లకు వ్యాయామం కలుగుతుంది.
News January 13, 2026
జాగ్రత్త.. ఆ వీడియో చూసి స్టాక్స్ కొంటున్నారా?

స్టాక్స్ కొనేవారిని BSE అలర్ట్ చేసింది. తమ సీఈవో, ఎండీ సుందర రామమూర్తి కొన్ని కంపెనీల షేర్లు కొనాలని రిఫర్ చేస్తున్నట్లు SMలో చక్కర్లు కొడుతున్న వీడియో డీప్ఫేక్ అని వెల్లడించింది. తమ అధికారుల్లో ఎవరికీ స్టాక్ మార్కెట్ టిప్స్ ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి మోసపూరిత, అనధికార వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. SHARE IT.
News January 13, 2026
భోగి పళ్లలో ఏమేం ఉండాలి?

భోగి పళ్ల మిశ్రమంలో ప్రధానంగా రేగుపళ్లు ఉండాలి. వీటితో పాటు చిన్న చెరుకు ముక్కలు, శనగలు, చిల్లర నాణాలు, బంతిపూల రేకులు కలపాలి. కొన్ని ప్రాంతాల్లో వీటికి అదనంగా బియ్యం, నల్ల నువ్వులు కలుపుతారు. రేగుపళ్లు సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైనవి. నాణాలు లక్ష్మీదేవికి సంకేతం. ఈ వస్తువులన్నీ కలిపి పిల్లల తలపై పోయడం వల్ల వారిలోని గ్రహ దోషాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని సంప్రదాయం చెబుతోంది.


