News January 4, 2025
బుమ్రా బౌలింగ్పై రేపు నిర్ణయం!
మ్యాచ్ మధ్యలో బుమ్రా స్కానింగ్కి వెళ్లడంపై ఫ్యాన్స్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. అతను వెన్నునొప్పితో బాధపడుతున్నారని, మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తున్నట్లు ప్రసిద్ధ్ కృష్ణ తెలిపారు. స్కానింగ్ తర్వాత బుమ్రా పరిగెత్తుతూ మెట్లెక్కి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లడం చూస్తే పెద్దగాయం కాలేదని తెలుస్తోంది. 2వ ఇన్నింగ్స్లో బుమ్రా బ్యాటింగ్ చేస్తారని, బౌలింగ్పై రేపు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 25, 2025
గన్నవరం హైవేపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్
గన్నవరం జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. 60 సంవత్సరాల వృద్ధుడు రోడ్డు దాటుతుండగా లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వృద్ధుడు లారీ చక్రాల కిందపడి స్పాట్లోనే మృతి చెందాడు. గన్నవరం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 25, 2025
కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం చెప్పలేదు: చంద్రబాబు
AP: గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టమంటూ బీఆర్ఎస్ నేత <<15250698>>హరీశ్ రావు<<>> చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘బనకచర్లకు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదు. వరద జలాలను మాత్రమే తరలిస్తాం. తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం నిర్మిస్తే మేం అభ్యంతరం చెప్పలేదు’ అని వెల్లడించారు. అటు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు.
News January 25, 2025
మహాత్మాగాంధీకి ఇండోనేషియా అధ్యక్షుడి నివాళులు
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఢిల్లీలోని రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఆ దేశంతో భారత దౌత్యబంధం మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ప్రబోవోను భారత సర్కారు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో భారత్కు చేరుకున్న ఆయన, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.