News February 27, 2025
అఫ్గాన్ చేతిలో ఓటమి.. కెప్టెన్సీపై బట్లర్ కీలక వ్యాఖ్యలు

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం తన కెప్టెన్సీపై జోస్ బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఇప్పుడు ఎలాంటి ఎమోషనల్ స్టేట్మెంట్ ఇవ్వదలుచుకోలేదు. కానీ మిగతా జట్టు సభ్యుల కోసం నేను అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. దీంతో త్వరలో బట్లర్ వన్డే కెప్టెన్సీకి రాజీనామా చేయనున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Similar News
News February 27, 2025
సెలీనియం అంటే?

<<15592975>>సెలీనియం<<>> అనేది నీరు, కొన్ని రకాల ఆహార పదార్థాల నుంచి శరీరానికి సహజంగా అందే ఖనిజం. ఇది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి, పునరుత్పత్తి అవయవాలు పని చేసేందుకు చాలా అవసరం. దీని అవసరం కొంతే అయినా ఆరోగ్యాన్ని కాపాడటంతో కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ సెలీనియం మోతాదు ఎక్కువైతే జుట్టు రాలడం, గోళ్లు పెలుసుగా మారటం, చర్మ సంబంధ వ్యాధులొస్తాయి. ముఖ్యంగా వెంట్రుకల కుదుళ్లను బలహీనపరిచి జుట్టు రాలడానికి కారణం అవుతుంది.
News February 27, 2025
చేనేత వస్త్రంపై చంద్రబాబు ఫ్యామిలీ ఫొటో

AP: మంగళగిరికి చెందిన టీడీపీ అభిమాని జంజనం మల్లేశ్వరరావు, ఆయన కుమారుడు కార్తికేయ మంత్రి నారా లోకేశ్కు చేనేత వస్త్రాన్ని బహూకరించారు. దానిపై చంద్రబాబు ఫ్యామిలీ ఫొటో ఉండటంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ‘మా కుటుంబసభ్యుల చిత్రాలతో వారు నేసిన చేనేత వస్త్రాన్ని బహూకరించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలాగే వీళ్లు నియోజకవర్గంలో చేస్తున్న సామాజిక సేవకు సాయం అందిస్తాం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
News February 27, 2025
ఆ 8 మంది చనిపోయి ఉంటారు: అధికారులు

TG: SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ప్రాణాలపై అధికారులు ఆశలు వదులుకున్నారు. వాళ్లంతా టీబీఎం మెషీన్ చుట్టూ బురదలో కూరుకుపోయి చనిపోవచ్చని భావిస్తున్నారు. నిన్న ఆర్మీ రెస్క్యూ టీమ్ టన్నెల్ చివరివరకు వెళ్లి చూడగా ప్రమాద స్థలంలో మట్టి, బురద తప్ప మనుషుల జాడ కనిపించలేదు. అక్కడ అత్యంత భయానక పరిస్థితులు ఉన్నట్లు తెలిపారు. శిథిలాలు తొలగిస్తే టన్నెల్ మళ్లీ కూలే ప్రమాదం ఉందంటున్నారు.