News May 2, 2024
హైదరాబాద్లో ఢిల్లీ పోలీసులు.. తీవ్ర ఉత్కంఠ

అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు విచారణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. టీపీసీసీ సోషల్ మీడియాకు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉండగా.. పలువురిని విచారిస్తారని తెలుస్తోంది. అటు ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. తాజాగా మరోసారి రాష్ట్రానికి రావడంతో ఏమైనా అరెస్టులు జరుగుతాయా? అనే ఉత్కంఠ నెలకొంది.
Similar News
News December 15, 2025
మెస్సీతో హ్యాండ్షేక్ కోసం రూ.కోటి!

‘గోట్ టూర్’లో భాగంగా అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. చాణక్యపురిలోని ప్రఖ్యాత లీలా ప్యాలెస్లో బస చేయనున్నారు. అక్కడ ఎంపిక చేసిన VIPలు, అతిథులకు మెస్సీతో క్లోజ్డ్ డోర్ ‘మీట్ అండ్ గ్రీట్’ ఏర్పాటు చేశారు. ఇందులో మెస్సీని కలిసి మాట్లాడేందుకు కొందరు కార్పొరేట్లు ₹కోట్లు కుమ్మరిస్తున్నట్లు సమాచారం. షేక్ హ్యాండ్ కోసమే ₹కోటి చెల్లించుకుంటున్నట్లు జాతీయ మీడియా చెబుతోంది.
News December 15, 2025
కలెక్షన్ల సునామీ.. రెండో వీకెండ్లో రూ.146కోట్లు

రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన రెండో వీకెండ్(శుక్ర, శని, ఆదివారం)లో అత్యధిక కలెక్షన్లు(రూ.146.60 కోట్లు) సాధించిన హిందీ చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు హిందీలో పుష్ప-2, ఛావా సినిమాలు మాత్రమే సెకండ్ వీకెండ్లో ₹100కోట్లు సాధించినట్లు తెలిపాయి. ఓవరాల్గా ధురంధర్ ₹553Cr సాధించినట్లు మూవీ టీమ్ ప్రకటించింది.
News December 15, 2025
300 పోస్టులు.. 3 రోజుల్లో ముగుస్తున్న దరఖాస్తు గడువు

OICL 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ DEC 18తో దరఖాస్తు గడువు ముగుస్తోంది. పోస్టులను బట్టి డిగ్రీ, MA పీజీ గల వారు అర్హులు. జనవరిలో టైర్-1, ఫిబ్రవరిలో టైర్-2 ఎగ్జామ్స్ ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అధికారిక సైట్, అప్లికేషన్ కోసం IBPS సైట్ చూడండి.


