News April 1, 2024
ధోనీ ధనాధన్.. పదేళ్ల క్రితం ట్వీట్ వైరల్

నిన్నటి ఢిల్లీ, చెన్నై మ్యాచ్లో ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది. CSK ఓడినా మునపటి ధోనీని చూశాం, అది చాలు అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ పదేళ్ల క్రితం చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ఏ జట్టు గెలుస్తుందనేది అనవసరం, నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే ఉన్నా’ అని 2014, మార్చి 24న ట్వీట్ చేశారు. అన్నట్టుగానే ధోనీ ఎంటర్టైన్ చేశారంటూ ఫ్యాన్స్ ఆ పాత పోస్ట్ను ట్రెండ్ చేస్తున్నారు.
Similar News
News February 9, 2026
పట్టణాల్లో జీ ప్లస్ 3, 5 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లు!

TG: పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లను జీ ప్లస్ 3, 5 టవర్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఒక్కో టవర్లో 12 ఇళ్లు ఉండేలా నిర్మాణం చేపట్టనుంది. ఇప్పటికే వీటి నిర్మాణానికి 19 స్థలాలు గుర్తించినట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్) నుంచి నిర్మాణాలు ప్రారంభించనుంది. దీనికి సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు హౌసింగ్ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు.
News February 9, 2026
జంద్యం ధరిస్తున్నారా?

జంద్యం పొడవు వ్యక్తి ఎత్తుకు సమానంగా ఉంటుంది. ఇది జాగరణ, స్వప్న, సుషుప్తి, తురీయ అనే 4 ఆత్మ స్థితులను సూచిస్తుంది. దీనిని ధరించే విధానంలో 3 రకాలు ఉన్నాయి. శుభ కార్యాల్లో ఎడమ భుజంపై(సవ్యం), అశుభ కార్యాల్లో కుడి భుజంపై(ప్రాచీనావీతి), మలమూత్ర విసర్జన సమయంలో మెడలో దండలా(నివీతం) ధరించాలి. ఏటా శ్రావణ పూర్ణిమ లేదా జంద్యాల పూర్ణిమ నాడు కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించాలి.
News February 9, 2026
గొర్రెల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

గొర్రెల మంద ఎదుగుదలలో ఆడగొర్రెలది కీలకపాత్ర. ఇది ఎంత బాగుంటే మంద అంత బాగుంటుంది. ఆడ గొర్రెలు త్వరగా ఎదిగి , సంతానోత్పత్తికి అనుకూలంగా మారే లక్షణం కలిగి ఉండాలి. మందలో పునరుత్పాదక శక్తి తగ్గిన, పళ్లు లేని గొర్రెలను ఏరివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఎదకి రాని గొర్రెలు, గొడ్డుమోతు జీవాలను మంద నుంచి ఏరివేసి, చూడి లేదా తొలిసారి ఈనిన గొర్రెలను కొంటే బాగుంటుంది. ఏటా ముసలి గొర్రెలను మంద నుంచి తీసేయాలి.


