News May 7, 2025

అరుదైన మైలురాయికి చేరుకున్న ధోనీ

image

IPL: SRHతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో CSK కెప్టెన్ ధోనీ అరుదైన మైలురాయికి చేరుకున్నారు. టీ20ల్లో 400 మ్యాచులు ఆడిన నాలుగో భారత క్రికెట‌ర్‌గా నిలిచారు. ఈ లిస్టులో ధోనీ కంటే ముందు రోహిత్(456), దినేశ్ కార్తీక్(412), కోహ్లీ(408) ఉన్నారు. ధోనీ తన టీ20 కెరీర్లో ఇప్పటి వరకు 7572 పరుగులు చేయగా, అందులో 28 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 84*.

Similar News

News February 9, 2026

శ్రీవారి భక్తులకు శుభవార్త

image

AP: తిరుమలలో సులభంగా లడ్డూలు పొందేందుకు వీలుగా విక్రయ కేంద్రాల్లో UPI పేమెంట్లను అనుమతించాలని TTD నిర్ణయించింది. ప్రస్తుతం క్యాష్ ద్వారానే లడ్డూలు తీసుకునే పరిస్థితి ఉంది. కియోస్క్ యంత్రాలను అందుబాటులో తెచ్చినప్పటికీ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులొస్తున్నాయి. దీంతో కౌంటర్ల వద్దే పేమెంట్ క్యూఆర్ కోడ్‌ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. తొలుత కొన్ని కౌంటర్లలో అమలు తర్వాత అన్ని కేంద్రాలకూ విస్తరిస్తారు.

News February 9, 2026

ట్రేడ్ డీల్‌లో రైతాంగానికి రక్షణ: అమూల్ చీఫ్

image

USతో ట్రేడ్ డీల్‌తో వ్యవసాయ రంగానికి <<19081420>>నష్టం కలుగుతుందని<<>> రైతు సంఘాలు ఆందోళన చెందుతుండటం తెలిసిందే. అయితే ఈ డీల్ రైతులు, వ్యవసాయ రంగానికి రక్షణ కల్పిస్తుందని అమూల్ చీఫ్ జయన్ మెహతా తెలిపారు. ‘వాణిజ్య చర్చలనేవీ ఎప్పుడూ రెండు వైపులా జరిగే విషయాలు. DDGS వంటి పశువుల దాణాను డీల్‌లో చేర్చినంత మాత్రాన ఎలాంటి నష్టం కలగదు. DDGS వాడకం చాలా తక్కువ. పాడి, వ్యవసాయ రంగంపై ఆందోళన అవసరం లేదు’ అని చెప్పారు.

News February 9, 2026

బాలీవుడ్ హీరో స్టైల్‌లో బిల్డప్ ఇచ్చి.. అడ్డంగా దొరికిన నకిలీ IT ఆఫీసర్

image

బాలీవుడ్ హీరో స్టైల్‌లో ట్రేడర్లను బురిడీ కొట్టించాలని చూసిన ఓ నకిలీ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన విజయ్‌సింగ్ చౌహాన్ (51) సూరత్‌లోని టెక్స్‌టైల్ మార్కెట్‌లో సీనియర్ IT అధికారిగా బిల్డప్ ఇస్తూ ₹30లక్షలు డిమాండ్ చేసి ₹4 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. పక్కనే ఉన్న హోటల్‌కు క్యాష్‌తో రమ్మన్నాడు. అయితే సదరు ట్రేడర్‌కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.