News August 29, 2024
భారత హాకీకి పర్యాయపదం ధ్యాన్చంద్

హకీ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు మేజర్ ధ్యాన్చంద్. అంతర్జాతీయ వేదికల్లో భారత్ విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన హయాంలో మూడు సార్లు భారత్ ఒలింపిక్స్లో స్వర్ణం గెలుచుకుంది. హాకీ మాంత్రికుడిగా ధ్యాన్చంద్ పేరొందారు. హిట్లర్ వంటి నియంత మెప్పు పొందారంటే ఆయన ఆట ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హాకీలో దేశానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది.
Similar News
News January 12, 2026
గుమ్మానికి ఎదురుగా కిటికీ ఉండవచ్చా?

ఇంటి గుమ్మానికి ఎదురుగా కిటికీ ఉండటం మంచిదంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. ఈ నిర్మాణం బయట నుంచి వచ్చే సహజ గాలి, వెలుతురును అన్ని గదుల్లోకి ప్రసరించేలా చేస్తుందంటున్నారు. ‘ఇది గదిలో ఉండే వారికి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇల్లు ఎప్పుడూ తాజాదనంతో ఉంటుంది. ఇంట్లో ప్రతికూలత తగ్గి, గృహస్థులు ఉత్సాహంగా తమ జీవితాన్ని గడపడానికి దోహదపడుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 12, 2026
జగదీప్ ధన్ఖడ్కు తీవ్ర అస్వస్థత

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈనెల 10న అర్ధరాత్రి 2 సార్లు స్పృహతప్పి పడిపోయారని ఆయన కార్యాలయం తెలిపింది. ఢిల్లీలోని ఎయిమ్స్లో అడ్మిట్ చేసినట్లు చెప్పింది. 2025 మార్చిలోనూ ఆయన ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఎయిమ్స్ క్రిటికల్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స అందించారు. అనారోగ్య కారణాలతో గతేడాది జులైలో ఉపరాష్ట్రపతి పదవికి ఆయన <<17154846>>రాజీనామా<<>> చేయడం తెలిసిందే.
News January 12, 2026
శాంసంగ్కు చెక్.. టాప్ స్మార్ట్ఫోన్ బ్రాండ్గా యాపిల్

స్మార్ట్ఫోన్ బ్రాండ్లలో యాపిల్ కంపెనీ నంబర్ వన్గా నిలిచింది. ఐఫోన్ 17 సక్సెస్, 16కు భారీ డిమాండ్, సేల్స్లో 10 శాతం గ్రోత్ సాధించడంతో గత 14 ఏళ్లలో తొలిసారిగా టాప్లోకి వచ్చింది. శాంసంగ్ రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ మార్కెట్లో యాపిల్ 20%, శాంసంగ్ 19%, షియోమీ 13%, వివో 8%, ఒప్పో 8%, ఇతర బ్రాండ్లు 32% వాటా కలిగి ఉన్నాయి.


