News February 27, 2025
ఆర్టీసీలో ఏమైనా పొగొట్టుకున్నారా ? ఈ నంబర్కు కాల్ చేయండి

TG: ఆర్టీసీ టికెట్పై రాసిన చిల్లర తీసుకోకుండా మర్చిపోయారా? ఏం ఫర్వాలేదు. టోల్ ఫ్రీ నంబర్ 040-69440000 కాల్ చేసి మీరు ప్రయాణించిన బస్సు, టికెట్ వివరాలు చెబితే ఆ డబ్బులను RTC మీకు ఫోన్పే ద్వారా అందిస్తుంది. అంతేకాకుండా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో బస్సు మిస్సైనా అదే టికెట్పై మరో బస్సులో గమ్యానికి చేరవచ్చు. ఏవైనా వస్తువులు పొగొట్టుకున్నాటోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి వాటిని పొందొచ్చు.
Similar News
News February 27, 2025
ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు: మాధవ్

APలో YCP నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైరయ్యారు. తాను న్యాయ నిపుణుల సలహా తీసుకుని పోలీసుల విచారణకు సహకరిస్తానని చెప్పారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సూపర్-6 హామీలపై ప్రశ్నించినందుకే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రమంతటా భయంకర వాతావరణాన్ని సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
News February 27, 2025
అత్యంత వివాదాస్పద చిత్రం ఇదే!

భారత సినీ పరిశ్రమలో ఎన్నో వివాదాస్పద సినిమాలున్నాయి. కానీ, పియర్ పాలో పసోలిని డైరెక్ట్ చేసిన ‘120 డేస్ ఆఫ్ సొదొమ్’ మాత్రం అత్యంత వివాదాస్పదమైంది. దీన్ని 150 దేశాలు బ్యాన్ చేశాయి. ఇది 1975లో ఇటాలియన్లో విడుదలైంది. వరల్డ్ వార్-2 నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజైన కొద్దిరోజులకే డైరెక్టర్ హత్యకు గురయ్యారు. కిడ్నాప్ చేసిన పిల్లలపై లైంగిక వేధింపులు, క్రూరంగా హింసించిన దృశ్యాలను ఇందులో చూపించారు.
News February 27, 2025
9 నెలల్లోనే కూటమి మోసం ప్రజలకు అర్థమైంది: చెల్లుబోయిన

AP: ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక విస్మరించారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. 9 నెలల పాలనలోనే ప్రభుత్వం చేసిన మోసం ప్రజలకు అర్థమైందన్నారు. కక్ష సాధింపులకే సమయం వెచ్చిస్తూ పాలన గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. రాష్ట్ర అప్పులు, తిరుమల లడ్డూ అంశంలో అబద్ధాలు ప్రచారం చేశారని విమర్శించారు. నిత్యావసరాల ధరలను భారీగా పెంచేశారని ఆరోపించారు.