News June 21, 2024
వయనాడ్లో ప్రియాంకా తరఫున దీదీ ప్రచారం?

వయనాడ్లో జరగనున్న ఉప ఎన్నికలో ఏఐసీసీ అగ్ర నేత ప్రియాంకా గాంధీ తరఫున పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రచారం నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా కూటమి తరఫున ఆమె ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాగా రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్కు ఉపఎన్నిక అనివార్యమైంది. ఖాళీ అయిన స్థానానికి 6 నెలల్లో ఎన్నిక జరపాలనే నిబంధన ఉంది. దీంతో త్వరలోనే ఈసీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.
Similar News
News January 19, 2026
50 వేల మంది ఉద్యోగులను తీసుకుంటాం: డెలాయిట్

గ్లోబల్ సంస్థ డెలాయిట్ గుడ్న్యూస్ చెప్పింది. ఇండియాలో 50 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ‘ఇండియాలో 1.4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచంలోని ప్రతి నలుగురు డెలాయిట్ ఉద్యోగుల్లో ఒకరు ఇండియన్. మరో 50 వేల మందికిపైగా తీసుకుంటాం. సంస్థ విస్తరణ కోసం మంగళూరు(KA)లో బ్రాంచ్ ఏర్పాటు చేస్తాం’ అని కంపెనీ సౌత్ ఆసియా సీఈవో రోమల్ శెట్టి ఓ కార్యక్రమంలో తెలిపారు.
News January 19, 2026
ట్రంప్కు ఈయూ షాక్ ఇవ్వనుందా..!

గ్రీన్లాండ్ డీల్ను వ్యతిరేకించిన దేశాలపై ట్రంప్ టారిఫ్స్ <<18885220>>విధించడాన్ని<<>> యూరోపియన్ యూనియన్ (EU) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతీకార సుంకాలు విధించాలని భావిస్తోంది. ఈయూ చరిత్రలో తొలిసారిగా ‘ట్రేడ్ బజూకా’ను ప్రయోగించాలని ప్లాన్ చేస్తోంది. దీనికి అదనంగా 93 బిలియన్ యూరోల(రూ.9.8 లక్షల కోట్లు) ప్రతీకార టారిఫ్స్ విధించడాన్ని ఈయూ పరిశీలిస్తోందని రాయిటర్స్ ఏజెన్సీ తెలిపింది.
News January 19, 2026
అసలేంటీ ‘ట్రేడ్ బజూకా’!

తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు 2023లో ‘ట్రేడ్ బజూకా’(బెదిరింపుల వ్యతిరేక సాధనం-ACI)ను EU అమల్లోకి తెచ్చింది. ఇతర దేశాల ఆర్థిక బెదిరింపులు, బలవంతపు వాణిజ్య పద్ధతుల నుంచి తమ రక్షణ కోసం రూపొందించింది. కౌంటర్ టారిఫ్స్, దిగుమతులపై ఆంక్షలు, యూరోపియన్ మార్కెట్లలోకి ఆయా దేశాల యాక్సెస్ను, పెట్టుబడులను నియంత్రించడం, కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా బ్లాక్ చేయడం వంటి పవర్స్ దీనికి ఉంటాయి.


