News January 27, 2025
నిద్రలో ఇలా జరుగుతోందా?

నిద్రలో ఉన్నప్పుడు కొందరికి కండరాలు పట్టుకోవడం, తిమ్మిరి వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. దీంతో కొన్ని క్షణాల పాటు ఉక్కిరిబిక్కిరి అవుతారు. దీనికి డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత వంటివి కారణాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు నొప్పి ఉన్న చోట మసాజ్ లేదా వేడి కాపడం పెట్టాలని సూచిస్తున్నారు. నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతాయని అంటున్నారు.
Similar News
News November 9, 2025
CII సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి కొండపల్లి

AP: రాష్ట్రాన్ని మాన్యూఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలో MSME ఎగుమతుల అభివృద్ధి సదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘IT రంగంలోనూ విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది. MSME విభాగంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోంది. CII సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఏపీపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది’ అని పేర్కొన్నారు.
News November 9, 2025
రెండో అనధికారిక టెస్ట్.. ఇండియా-A ఓటమి

సౌతాఫ్రికా-Aతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో ఇండియా-A ఓడింది. భారత్ నిర్దేశించిన 417 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బవుమా సహా మరో నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. అటు భారత జట్టులో జురెల్ రెండు ఇన్నింగ్స్లోనూ సెంచరీలు బాదారు. అంతకుముందు తొలి అనధికారిక టెస్టులో IND గెలిచింది. కాగా ఈనెల 14 నుంచి IND, SA మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
News November 9, 2025
జపాన్లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్లో 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇవాటే ప్రావిన్సు తీరంలో 10కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అటు అండమాన్, నికోబార్ దీవుల్లోనూ ఈ మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది. ప్రాణ, ఆస్తి నష్టం గురించి వివరాలు వెల్లడి కాలేదు.


