News August 5, 2024

చదువు చెప్పిన కాలేజీకి రూ.228 కోట్ల విరాళం

image

APకి చెందిన వ్యాపారవేత్త కృష్ణా చివుకుల ఉదారత చాటుకున్నారు. తాను ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన IIT మద్రాస్‌కు ₹228 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. రేపు ఒప్పంద కార్యక్రమం జరగనుంది. బాపట్లకు చెందిన చివుకుల 1970లో ఏరోస్పేస్‌లో ఎంటెక్ పూర్తిచేశారు. న్యూయార్క్‌లో శివ టెక్నాలజీస్ కంపెనీని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత బెంగళూరు, రేణిగుంటలోనూ సంస్థలను నెలకొల్పారు. ఈయన గతంలోనూ ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేశారు.

Similar News

News December 8, 2025

ప్రయాణికుల రద్దీ.. ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే(SCR) నేటి నుంచి 8 ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి – యెలహంక, యెలహంక – చర్లపల్లి, చర్లపల్లి – షాలిమార్, షాలిమార్ – చర్లపల్లి మధ్య ఈ స్పెషల్ ట్రైన్లు నడవనున్నాయి. అలాగే HYD – కొట్టాయం, కొట్టాయం – HYD, చర్లపల్లి – H.నిజాముద్దీన్, H.నిజాముద్దీన్ – చర్లపల్లి మధ్య రైళ్లు నడుస్తాయని SCR తెలిపింది. రైళ్ల స్టాపులు తదితర వివరాలను పై ఫొటోల్లో చూడొచ్చు.

News December 8, 2025

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే?

image

☛ బీపీ, షుగర్‌లను అదుపులో ఉంచుకోవాలి.
☛ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరకంగా చురుకుగా ఉండాలి.
☛ ఎక్కువగా ఉప్పు కలిపిన ఫుడ్ తీసుకోకూడదు.
☛ రోజూ 2-3లీటర్ల నీరు తాగాలి.
☛ పెయిన్ కిల్లర్స్ అతిగా వాడకూడదు.
☛ ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
☛ తరచుగా కిడ్నీల పనితీరు, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

News December 8, 2025

సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు: పవన్

image

సనాతన ధర్మం మూఢనమ్మకం కాదని, ఆధ్యాత్మిక శాస్త్రమని AP Dy.CM పవన్ అన్నారు. ‘TNలో మన ధర్మాన్ని మనం అనుసరించడం కోసం న్యాయ పోరాటాలు చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇలా జరగకుండా ప్రతి హిందువులో చైతన్యం రావాలి. భగవద్గీత ప్రాంతాలకో, మతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదు. ముఖ్యంగా యువత గీత చదవాలి. మనసు కుంగినా, ఆలోచనలు అయోమయంలోకి నెట్టినా గీత ఓ కౌన్సిలర్‌, మెంటర్‌గా పనిచేస్తుంది’ అని ఉడుపి క్షేత్రంలో చెప్పారు.