News May 15, 2024

వరి కొయ్యలను కాల్చవద్దు: మంత్రి తుమ్మల

image

TG: పంటలు కోసిన తర్వాత రైతులు వరి కొయ్యలు, పంట వ్యర్థాలను కాల్చవద్దని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అలా కాల్చడం వల్ల అనేక ప్రాంతాల్లో ప్రమాదాలు తలెత్తి ఆస్తి, ప్రాణనష్టాలు సంభవిస్తున్నాయని తెలిపారు. వీటితో పాటు పర్యావరణం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. వాటి దహనాన్ని నిరోధించేందుకు వ్యవసాయ శాఖాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News December 15, 2025

పాడి పశువులకు టీకాలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

వాతావరణ మార్పుల కారణంగా పశువులకు కొన్ని బాక్టీరియా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పశువులకు ఆయా సీజన్లకు అనుగుణంగా టీకాలు వేయించాలి. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ☛ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు(ఉదయం, సాయంత్రం) మాత్రమే టీకాలు వేయించాలి. ☛ వ్యాధి సోకిన పశువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ టీకాలు వేయించకూడదు. ☛ ఒక టీకా వేసిన 10-15 రోజుల తర్వాత మాత్రమే ఇంకో టీకా వేయించాలి.

News December 15, 2025

ధనుర్మాసం ఎందుకంత ప్రత్యేకం?

image

సూర్యుడు ధనురాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఇది ఉత్తరాయణం ప్రారంభానికి ముందు వచ్చే పరమ పవిత్రమైన సంధికాలం. ఇది దేవతలకు రాత్రి చివరి భాగం వంటిది. ఈ మాసంలో సత్త్వగుణం వృద్ధి చెందుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘మాసానాం మార్గశీర్షోహం’ అని చెప్పాడు. ఆధ్యాత్మిక, భౌతిక ఫలాలను పొందడానికి, దైవారాధన చేయడానికి, దానధర్మాలు ఆచరించడానికి ఈ మాసం అత్యంత అనుకూలమైనది.

News December 15, 2025

NIEPMDలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టీపుల్ డిజబిలిటీస్ (<>NIEPMD<<>>) 25 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG, B.Ed, M.Ed, సంబంధిత విభాగంలో PhD, ఎంఫిల్, బీకామ్, ఎంకామ్, ఎంబీఏ, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 56ఏళ్లు. వెబ్‌సైట్: https://niepmd.nic.in