News May 1, 2024

నా ఒక్క ఓటే కదా.. అనుకోవద్దు

image

కొందరు ఓటు వేసేందుకు ఆసక్తి చూపరు. నా ఒక్క ఓటే కదా.. వేయకపోతే ఏమవుతుందిలే అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించగలదు. అనర్హులు ప్రజాప్రతినిధులుగా అందలమెక్కుతారు. ఓటు వేయకుంటే ప్రశ్నించే తత్వం కోల్పోతారు. ధైర్యంగా ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులతో పోరాడలేరు. ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోయినట్లే. అభ్యర్థుల పనితీరు నచ్చకపోతే నోటాకు ఓటేయొచ్చు. అందరూ బాధ్యతతో ఓటు వేయాలి.

Similar News

News December 13, 2025

నక్సలిజం పాము లాంటిది: అమిత్ షా

image

నక్సలిజం ఎవరికీ ప్రయోజనం కలిగించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. శాంతి మాత్రమే అభివృద్ధికి మార్గం చూపగలదని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ‘నక్సలిజం విషపూరితమైన పాము లాంటిది. దాన్ని అంతం చేసిన తర్వాత అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది’ అని బస్తర్ ఒలింపిక్-2025 ముగింపు కార్యక్రమంలో పేర్కొన్నారు.

News December 13, 2025

AP గోదావరి నీటి మళ్లింపును అనుమతించొద్దు: ఉత్తమ్

image

TG: గోదావరి నీటి మళ్లింపునకు AP పోలవరం-బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ పేరిట చేపట్టే ప్రాజెక్టును అధికారులు ఇవాల్యుయేషన్ చేయకుండా నిలువరించాలని కేంద్రం, CWCలను TG కోరింది. అలాగే కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు చర్యలనూ అడ్డుకోవాలంది. వీటిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్కసాగర్, TGకి కృష్ణా నీటి కేటాయింపు తదితరాలపై సహకారాన్ని అభ్యర్థించారు.

News December 13, 2025

రామేశ్వరం కేఫ్‌లో కేటీఆర్, అఖిలేశ్

image

TG: హైదరాబాద్‌లో పర్యటిస్తున్న యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఇవాళ రామేశ్వరం కేఫ్‌ను సందర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. కేఫ్‌లో వారిద్దరూ టిఫిన్ చేశారు. ఈ ఫొటోలను కేటీఆర్ తన X ఖాతాలో షేర్ చేశారు. కాగా నిన్న హైదరాబాద్‌కు వచ్చిన అఖిలేశ్.. తొలుత సీఎం రేవంత్ రెడ్డితో, తర్వాత కేటీఆర్‌తో భేటీ అయ్యారు.