News August 8, 2025

ఈ నెల 28 నుంచి దులీప్ ట్రోఫీ.. కెప్టెన్లు వీరే

image

దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2025 ఈ నెల 28 నుంచి బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గ్రౌండ్‌లో జరగనుంది. నార్త్ జోన్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, సెంట్రల్ జోన్‌కు ధ్రువ్ జురెల్, ఈస్ట్ జోన్‌కు ఇషాన్ కిషన్, సౌత్ జోన్‌కు తిలక్ వర్మ, వెస్ట్ జోన్‌కు శార్దూల్ ఠాకూర్‌ను కెప్టెన్లుగా నియమించారు. వీరిలో ఎవరైనా జాతీయ జట్టుకు ఆడాల్సి వస్తే ఆయా ప్లేయర్ల స్థానాలను వేరే ఆటగాళ్లతో భర్తీ చేస్తారు.

Similar News

News August 8, 2025

సంక్రాంతి బరిలో నిలిచేది ఎవరు?

image

వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేందుకు కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీని పొంగల్‌కు రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రవితేజ-కిశోర్ తిరుమల సినిమా, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ కూడా అప్పుడే విడుదలయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అటు ప్రభాస్ ‘రాజాసాబ్’, బాలకృష్ణ ‘అఖండ-2’ కూడా సంక్రాంతికే రిలీజ్ కావొచ్చనే టాక్ వినిపిస్తోంది.

News August 8, 2025

ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం

image

AP: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ‘నిషేధంపై ఆలయాల్లో బోర్డులు పెట్టాలి. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే కవర్ల స్థానంలో కాటన్/జూట్/పేపర్ బ్యాగులు వాడేలా చూడాలి. అరిటాకులు/స్టీల్ ప్లేట్లలో అన్నప్రసాదం వడ్డించాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనుమతించొద్దు. స్టీల్ మగ్గులు, గ్లాసులు అందుబాటులో ఉంచాలి’ అని అధికారులను ఆదేశించింది.

News August 8, 2025

ఫ్యామిలీతో మాట్లాడేందుకు తహవ్వుర్ రాణాకు అనుమతి

image

26/11 ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవూర్ రాణాకు ఫ్యామిలీతో ఫోన్ కాల్స్ మాట్లాడేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. అతడు తన కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రైవేట్ లాయర్‌ను నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడికి ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెందిన న్యాయవాది న్యాయ సహాయ సలహాదారుగా ఉన్నారు. అంతకుముందు ఫ్యామిలీతో మాట్లాడేందుకు రాణా చేసిన దరఖాస్తును తిహార్ జైలు అధికారులు వ్యతిరేకించారు.