News April 27, 2024
భూమి కరుగుతోంది.. కాంక్రీట్ జంగిల్ పెరుగుతోంది

పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, మౌలిక వసతుల కారణంగా 2005-22 మధ్య 21 లక్షల ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు జరిగాయి. ఇందులో 65% పంట భూములు, 35% వ్యవసాయనికి పనికిరాని భూములు ఉన్నట్లు NRSC-ISRO నివేదిక వెల్లడించింది. భవనాలు, రోడ్లు, రైళ్ల మార్గాలు, ఇండస్ట్రియల్ సైట్లు(పోర్టులు, ల్యాండ్ ఫిల్స్, క్వారీలు, రన్వేలు) నిర్మించినట్లు తెలిపింది. అభివృద్ధి జరుగుతూనే పర్యావరణానికీ హాని కలుగుతోందని పేర్కొంది.
Similar News
News April 14, 2026
ఎన్నికలు ముగిశాక పెట్రోల్ రేట్లు పెంచే అవకాశం: Macquarie

క్రూడాయిల్ ధరలు పెరిగినా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచకపోవడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు భారీగా నష్టపోతున్నాయని Macquarie అనే గ్రూప్ తెలిపింది. బ్యారెల్ ధర 135-165 డాలర్ల మధ్య ఉంటే లీటర్ పెట్రోల్పై రూ.18, లీటర్ డీజిల్పై రూ.35 చొప్పున నష్టాలు వస్తున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ చివర్లో తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది.
News April 14, 2026
ఇంజెక్షన్ల రీయూజ్.. పాక్లో 331 మంది చిన్నారులకు HIV!

పాకిస్థాన్లోని టౌన్సాలో THQ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చిన్నారులను బలితీసుకుంటోంది. ఇంజెక్షన్ల కోసం వాడిన సిరెంజ్లనే మళ్లీ ఉపయోగించడంతో
331 మంది చిన్నారులు HIV బారిన పడినట్లు బీబీసీ దర్యాప్తులో తేలింది. 2024 నవంబరు నుంచి 2025 అక్టోబరు మధ్య ఈ కేసులు నమోదయ్యాయి. కాగా వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఆరోపణలను ఆస్పత్రి యాజమాన్యం ఖండిస్తోంది.
News April 14, 2026
సీఎం పదవికి నితీశ్ రాజీనామా

ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్ను గవర్నర్కు అందజేశారు. మరికాసేపట్లో బీజేపీ కొత్త సీఎం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించనుంది. బిహార్కు నితీశ్ 21 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ రాష్ట్రంలో 243 అసెంబ్లీ సీట్లు ఉండగా NDAకు 202 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.


