News October 3, 2024
ఆ ఒక్క స్టాక్ మినహా మిగిలినవన్నీ రెడ్లోనే

JSW Steels (1.18%) మినహా BSEలో మిగిలిన 29 స్టాక్స్ గురువారం రెడ్లోనే ముగిశాయి. LT అత్యధికంగా 4.18% నష్టపోయింది. ఇటీవల సూచీలు జీవితకాల గరిష్ఠాలను తాకుతున్నాయి. అయినా ఒడిదొడుకుల మధ్య బుల్ జోరు కొనసాగింది. అయితే, ఓవర్ వాల్యూయేషన్ భయాలకు మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరలు తోడవ్వడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో ఒక్కరోజులోనే రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
Similar News
News December 5, 2025
ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి

TG: వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. తొలి విడతలో 4 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామన్నారు. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇస్తామని తెలిపారు.
News December 5, 2025
‘పుష్ప-2’కు ఏడాది.. అల్లుఅర్జున్ స్పెషల్ ట్వీట్

‘పుష్ప2’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ప్రేక్షకుల నుంచి లభించిన అపారమైన ప్రేమ తమకు మరింత ధైర్యాన్నిచ్చిందని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిత్రాన్ని అద్భుతంగా మార్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కెప్టెన్’ సుకుమార్ సహా చిత్రబృందానికి ధన్యవాదాలు చెప్పారు. ‘పుష్ప’గా ఈ 5ఐదేళ్ల ప్రయాణం తన జీవితంలో మరువలేనిదని కొనియాడారు.
News December 5, 2025
ఏపీలో తొలి సోలార్ వేఫర్ యూనిట్: నారా లోకేశ్

AP: దేశంలోనే తొలి సోలార్ ఇంగోట్ వేఫర్ తయారీ యూనిట్ ఏపీలో ఏర్పాటవుతున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. అనకాపల్లిలో ReNewCorp రూ.3,990 కోట్ల పెట్టుబడితో 6GW సామర్థ్యంతో ఈ యూనిట్ను స్థాపించనున్నట్లు ‘X’ వేదికగా వెల్లడించారు. CII పార్ట్నర్షిప్ సమ్మిట్లో కుదిరిన MoU ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని పేర్కొన్నారు.


